
TRAI: సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా 'ట్రాయ్' కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న వేళ, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్కు వచ్చే సందేశాలు నిజమైనవా, నకిలీవా అన్న విషయాన్ని గుర్తించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై మొబైల్కు వచ్చే ప్రతి మెసేజ్ ముందు 'పీ', 'ఎస్', 'టీ', 'జీ' వంటి అక్షరాలను ఉపయోగించనున్నారు. ఈ అక్షరాల ద్వారా సందేశం ఏ కేటగిరీకి చెందినదో సులభంగా గుర్తించవచ్చని ట్రాయ్ స్పష్టం చేసింది. వాటిలో పీ (P) అంటే ప్రమోషనల్ ఎస్ (S) అంటే సర్వీస్, టీ (T) అంటే ట్రాన్సాక్షనల్, జీ (G) అంటే గవర్నమెంట్ అని అర్థం.
Details
ప్రజలు అవగాహన పెంచుకోవాలి
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో అనుమానాస్పద సందేశాలు, లింకులు పంపి ప్రజలను మోసపూరితంగా బలిలోపడేస్తున్న ఘటనలు భారీగా పెరిగాయి. సైబర్ మోసగాళ్ల వల్ల నిత్యం బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజులు, లింకులపై ఎలాంటి నమ్మకం కలిగించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త విధానం ప్రజలకు అవగాహన పెంచడంలో కీలకంగా నిలవనుంది.