
Rohit-kohli: 2027 వరల్డ్కప్? రోహిత్, కోహ్లీపై గంగూలీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్టులకు వీడ్కోలు పలికారు. అంతకుముందే టీ20 ప్రపంచకప్ విజయంతో పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం మిగిలింది వన్డే ఫార్మాట్ మాత్రమే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనేది వీరి లక్ష్యమని భావిస్తున్నారు. కానీ రాబోయే ప్రపంచకప్ నాటికి రోహిత్, కోహ్లీ వన్డేలో కొనసాగగలరా..? ఈ అంశంపై మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) తాజాగా స్పందించారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదుపరి వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.
Details
ఫిట్నెస్ ఉండాలి
'తదుపరి వరల్డ్ కప్ మధ్య కనీసం 27 వన్డే మ్యాచ్లు ఉంటాయి. రోహిత్, కోహ్లీ ఈ మెగా టోర్నీలో ఆడాలంటే, అవన్నీ ఆడే శక్తిని, ఫిట్నెస్ను కాపాడుకోవాలి. అది అంత సులభం కాదు. నేను వారికి ఏ సలహా ఇవ్వలేను. ఆటపై వారికి మంచి అవగాహన ఉంది. వారు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక విషయం అందరికీ తెలుసుకోవాలి. ఆట ఎప్పుడో ఒకప్పుడు మనందరినీ వదిలిపోతుందని గంగూలీ పేర్కొన్నారు. 2027 నాటికి విరాట్ కోహ్లీ వయసు 39, రోహిత్ శర్మ వయసు 40 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయానికి ఫిట్నెస్ కాపాడుకోవడమే ప్రధాన సవాలుగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.