IPL 2026: ఢిల్లీ vs ఆర్సీబీ పోరులో కీలక మైలురాళ్లు.. సొంత గడ్డపై కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) మధ్య ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటికే బెంగళూరులో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఆర్సీబీ ఈసారి బలంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో పలువురు ఆటగాళ్లు తమ కెరీర్లో కొత్త రికార్డులు, మైలురాళ్లు అందుకునే అవకాశముంది. విరాట్ కోహ్లీ తన సొంత గడ్డపై చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. మరో 111 పరుగులు చేస్తే ఐపీఎల్లో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు.
వివరాలు
6 సిక్సులు కొడితే ఆ రికార్డు బద్దలు..
అలాగే ఇంకో 68 పరుగులు చేస్తే భారత గడ్డపై 10,000 టీ20 పరుగులు చేసిన ఆటగాడిగా మారతాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 6 సిక్స్లు కొడితే టీ20 క్రికెట్లో మొత్తం 450 సిక్స్లను పూర్తి చేస్తాడు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ టీ20ల్లో 350 వికెట్ల క్లబ్లో చేరడానికి కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. జోష్ హేజిల్వుడ్ మరో వికెట్ తీస్తే ఆర్సీబీ తరఫున 50 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరో 18 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 8,500 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
వివరాలు
కుల్దీప్ ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?
ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మరో 6 సిక్స్లు కొడితే ఐపీఎల్లో 100 సిక్స్ల మార్క్ చేరుకుంటాడు. మరో 4 ఫోర్లు కొడితే టీ20ల్లో 250 బౌండరీలు పూర్తి చేసినవాడవుతాడు. ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ రజత్ పటిదార్కు ఇది బెంగళూరు తరఫున 50వ మ్యాచ్ కానుంది. ఢిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ మరో 11 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 12,000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఐపీఎల్లో 50 క్యాచ్లు పూర్తి చేయడానికి కేవలం ఒక క్యాచ్ దూరంలో ఉన్నాడు. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరో 2 వికెట్లు తీస్తే టీ20 క్రికెట్లో 250 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.