LOADING...
IND vs SA: భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం… రాంచీలో రో-కో జంట సచిన్-ద్రవిడ్‌ను రికార్డును అధిగమించే అవకాశం! 
భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం… రాంచీలో రో-కో జంట సచిన్-ద్రవిడ్‌ను రికార్డును అధిగమించే అవకాశం!

IND vs SA: భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం… రాంచీలో రో-కో జంట సచిన్-ద్రవిడ్‌ను రికార్డును అధిగమించే అవకాశం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు దాదాపు 25 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 30 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ జట్టులోకి చేరడంతో భారత వన్డే జట్టు మరింత బలంగా మారిందని భావిస్తున్నారు. టెస్టు సిరీస్‌ ఓటమి నిరాశ నుంచి బయటపడేందుకు ఈ వన్డే సిరీస్‌ను గెలవాలని టీమ్‌ఇండియా అభిమానులు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోహిత్-కోహ్లీ జోడీ ముందున్న మైలురాయి ఎంతో ముఖ్యమైనది. రాంచీ వన్డేలో వీరిద్దరూ క్రీజులో కలసి నిలబడగానే సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సంయుక్త రికార్డ్‌ను అధిగమించినట్టే.

Details

రోహిత్‌-కోహ్లీ జోడీకి విశేష ప్రజాదరణ

భారత క్రికెట్‌ చరిత్రలో రోహిత్‌-కోహ్లీ జోడీకి విశేష ప్రజాదరణ ఉంది. వీరు కలిసి అనేక విలువైన భాగస్వామ్యాలు నిర్మించడమే కాకుండా భారత జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించారు. ఇప్పటి వరకు ఈ జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడారు. సచిన్‌-ద్రవిడ్‌ కూడా సరిగ్గా ఇన్ని మ్యాచ్‌లు జోడీగా ఆడారు. రాంచీ వన్డే ముగిసే సరికి రో-కో జోడీగా ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 392కి చేరి, భారత జట్టు చరిత్రలో ఏ జోడీ సాధించని రికార్డును సృష్టించనుంది. ఇదే సమయంలో విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా జోడీ ఇప్పటివరకు 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడారు.

Details

టీమ్‌ఇండియా తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోడీలు 

రోహిత్‌ శర్మ - విరాట్‌ కోహ్లీ: 391* సచిన్‌ తెందూల్కర్‌ - రాహుల్‌ ద్రవిడ్‌: 391 రాహుల్‌ ద్రవిడ్‌ - సౌరవ్‌ గంగూలీ: 369 సచిన్‌ తెందూల్కర్‌ - అనిల్‌ కుంబ్లే: 367 సచిన్‌ తెందూల్కర్‌ - సౌరవ్‌ గంగూలీ: 341 విరాట్‌ కోహ్లీ - రవీంద్ర జడేజా: 309 వన్డేల్లో భారత్‌ vs దక్షిణాఫ్రికా 1991 నుంచి ఇప్పటి వరకు భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు 94 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో భారత్‌ 40 మ్యాచ్‌లు గెలవగా, దక్షిణాఫ్రికా 51 మ్యాచ్‌లలో విజయం సాధించింది. భారత్‌ స్వదేశంలో 18, తటస్థ వేదికపై 10 విజయాలు అందుకుంది. దక్షిణాఫ్రికా తమ మట్టిలో 26, తటస్థ వేదికల్లో 11 మ్యాచ్‌లలో గెలిచింది.

Advertisement