LOADING...
MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..
చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..!

MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఎస్కే అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్.ధోనీ మరోసారి తన ఎంట్రీపై ఆసక్తి పెంచి చివరి క్షణంలో నిరాశపరిచినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకున్నప్పటికీ, ధోనీ ఇంకా మైదానంలోకి దిగలేదు. ప్రతి సీఎస్కే మ్యాచ్‌కు ముందు ఆయన ఆడతారని ప్రచారం జరుగుతూ, మ్యాచ్ సమయానికి మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల ముంబయి ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌గా ఉన్నాడని, త్వరలోనే ఆడతాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వాంఖడే స్టేడియంలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆయన పాల్గొనడంలేదని సమాచారం వెలువడింది. ఈ విషయాన్ని రెవ్ స్పోర్ట్స్ వెల్లడించింది.ఆ

వివరాలు

ఆరోజే ధోనీ జట్టులోకి వచ్చే అవకాశం..

ఇక చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 26న గుజరాత్ టైటాన్స్ తో చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడనుంది. అదే మ్యాచ్‌లో ధోనీ తిరిగి జట్టులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆయన, నేరుగా హోమ్ గ్రౌండ్‌లోనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. అయితే, ధోనీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడనే ఆశతో అభిమానులు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఆయన ఆడరని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతి మ్యాచ్ ముందు ఆయన ఆడతాడనే వార్తలు రావడం, తర్వాత మరో మ్యాచ్‌కు వాయిదా పడటం తరచూ జరుగుతోంది.

వివరాలు

అభిమానులు వెయిటింగ్..

మొత్తానికి, వాంఖడేలో ధోనీ ఆడకపోవడం అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు గాయంతో జట్టుకు దూరమైన ఆయన, మొదట మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటారని సీఎస్కే యాజమాన్యం తెలిపింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో మ్యాచ్‌కు సిద్ధం కావడానికి మరికొంత సమయం అవసరమని చెప్పారు. ప్రస్తుతం జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా, మైదానంలోకి దిగేందుకు ఇంకా సమయం పడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందువల్ల, ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు మరికొన్ని మ్యాచ్‌లు వేచి చూడాల్సి వచ్చేలా ఉంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement