
Preity Zinta : మంచి మనసు చాటిన నటి ప్రీతి జింతా.. ఇండియన్ ఆర్మీకి భారీ సాయం!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి ప్రీతి జింతా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
హిందీతో పాటు తెలుగు చిత్రాల్లోనూ తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పలువురు సీనియర్ హీరోలతో కలిసి నటించి సందడి చేసింది.
ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ఇచ్చిన ప్రీతి, వ్యాపార రంగంలో అడుగులు పెట్టి బిజీగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ సహయజమానిగా వ్యవహరిస్తున్న ఆమె.. ప్రతి మ్యాచ్కి ప్రత్యక్షంగా హాజరై జట్టును ఉత్సాహపరుస్తూ కనిపిస్తుంటుంది.
విజయాలు, పరాజయాలకతీతంగా తన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే ప్రీతి అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.
Details
రూ.1.10 కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రీతి జింతా
కేవలం పంజాబ్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర జట్ల అభిమానులు కూడా ప్రీతి జింతాను ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు.
తాజాగా, సైనిక కుటుంబాల పట్ల తన బాధ్యతను చాటుతూ ప్రీతి జింతా మరో మహోత్తరమైన నిర్ణయాన్ని తీసుకుంది.
సౌత్ వెస్ట్రన్ కమాండ్కి చెందిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA)కి రూ.1.10 కోట్లు విరాళంగా ప్రకటించింది.
ఈ విరాళాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా అందజేసింది.
జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు శప్తా శక్తి, ఆర్మీ కుటుంబాల సమక్షంలో ఈ విరాళం అందించింది.
Details
న్యాయ పోరాాటానికి దిగిన ప్రీతి
ఈ నిధిని వీరనారీమణుల సాధికారత, వారి పిల్లల విద్య కోసం వినియోగించనున్నారు. ''సైనికుల త్యాగాలకు మేం విలువ కట్టలేం. కానీ వారి కుటుంబాలకు మద్దతుగా ఉండటం మన బాధ్యత.
సాయుధ దళాల ధైర్యవంతుల కుటుంబాలకు ఎంతచేసినా తక్కువే,'' అంటూ ప్రీతి తన సేవా దృక్పథాన్ని తెలియజేశారు.
ఇక మరోవైపు ప్రీతి జింతా ఇటీవల పంజాబ్ కింగ్స్ సహయజమానులు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా లపై న్యాయపోరాటానికి దిగింది.
కంపెనీ చట్టం 2013 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారని ఆరోపిస్తూ, పిటిషన్ దాఖలు చేసింది.
తగిన నియమాలు పాటించకుండానే సమావేశాన్ని నిర్వహించారంటూ తను కోర్టును ఆశ్రయించింది.