NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ayush Mhatre-CSK: ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై జట్టులో 17 ఏళ్ల అయూష్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ayush Mhatre-CSK: ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై జట్టులో 17 ఏళ్ల అయూష్‌
    ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై జట్టులో 17 ఏళ్ల అయూష్‌

    Ayush Mhatre-CSK: ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై జట్టులో 17 ఏళ్ల అయూష్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    08:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కీలకమైన బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా, కెప్టెన్ పాత్రను కూడా నిర్వహిస్తున్నాడు.

    అయితే, తాజా ఐపీఎల్ సీజన్‌లో అతడు గాయానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు టోర్నమెంట్‌కి దూరమయ్యాడు.

    రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేయాలంటే జట్టు ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ ఆటగాడిని ఎంపిక చేస్తుందని అందరూ భావించారు.

    కానీ అంచనాలన్నింటికీ విరుద్ధంగా, చెన్నై జట్టు 17 ఏళ్ల యువ క్రికెటర్ అయూష్ మాత్రేకు అవకాశమిచ్చింది.

    వివరాలు 

    తొలి మ్యాచ్‌లోనే కర్ణాటకపై 78 పరుగులు

    2024 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ముంబయి తరఫున క్రికెట్‌లోకి ప్రవేశించిన ఈ యువ ఓపెనర్, తన తొలి మ్యాచ్‌లోనే కర్ణాటకపై 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

    అనంతరం నాగాలాండ్‌పై 181 పరుగులు, సౌరాష్ట్రపై 148 పరుగులు నమోదు చేసి సెలెక్షన్ కమిటీ సహా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

    జనవరి 2024లో మేఘాలయపై తన తొలి రంజీ మ్యాచ్‌ను ఆడాడు. అయినప్పటికీ మెగా వేలంలో అతనిపై ఎలాంటి ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.

    అయితే, రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన అనంతరం చెన్నై జట్టు ఈ యువ ప్రతిభావంతుడిని రూ.30 లక్షల కనీస ధరకు తమ జట్టులోకి తీసుకుంది.

    వివరాలు 

    సన్‌రైజర్స్‌ జట్టులోకి రవిచంద్రన్‌ ఎంట్రీ - జంపాకు బదులు ఎంపిక 

    మరో వైపు, లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా గాయంతో జట్టుకు దూరమైన నేపథ్యంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల రవిచంద్రన్ సమరన్‌ను తీసుకుంది.

    ఎడమచేతి బ్యాట్స్‌మెన్ అయిన రవిచంద్రన్, రూ.30 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలోకి చేరాడు.

    ఇప్పటి వరకు అతడు 7 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 64.50 సగటుతో మొత్తం 516 పరుగులు సాధించాడు.

    టీ20 ఫార్మాట్‌లోనూ మంచి ప్రదర్శన చేసిన ఈ యువ ఆటగాడు, 6 మ్యాచ్‌ల్లో 170 పరుగులు చేశాడు.

    యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి జట్టు అతనికి అవకాశం కల్పించడంతో అతడి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    చైన్నై సూపర్ కింగ్స్

    చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్  రాజస్థాన్ రాయల్స్
    టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లిన రాజస్థాన్.. ఆరెంజ్ క్యాప్‌ లీడ్‌లో ఆర్సీబీ ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్
    డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై ఐపీఎల్
    ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్ ఎంఎస్ ధోని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025