Pakistan vs India T20 2026: భారత్తో మ్యాచ్ కు బాబర్ అజామ్ దూరం.. కారణం ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా-పాక్ హైవోల్టేజ్ T20 మ్యాచ్ కు కేవలం కొన్ని గంటలు మిగిలిన సమయంలో కొలంబోకు ఇప్పటికే ఇరు జట్లు చేరుకున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తమ స్టార్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ భారత్పై బాగా రాణిస్తాడని, భారీ స్కోర్లు సాధిస్తాడని ఆశిస్తున్న తరుణంలో, సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త వ్యాప్తి చెందింది. USAతో జరిగిన మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన బాబర్ 32 బంతుల్లో 46 పరుగులు, 143.75 స్ట్రైక్ రేట్తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే భారత్తో టి20 అంతర్జాతీయాల్లో అతని రికార్డు అంతగా మెరుగైనదిగా లేనందున విశ్రాంతి ఇవ్వవచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
Details
పాక్ జట్టులో ఎక్కువమంది స్పిన్నర్లు
బాబర్ అజామ్ భారత్తో మొత్తం ఐదు T20 అంతర్జాతీయాల్లో 128.04 స్ట్రైక్ రేట్, 26.25 సగటుతో 105 పరుగులు సాధించాడు. భారత్పై అతని అత్యధిక ఇన్నింగ్స్ 68 పరుగులు, ఇది 2021 T20 ప్రపంచకప్లో నమోదైనది. ఫఖర్ జమాన్ భారత్పై రికార్డు అంతగా ఆకట్టకపోయినా, అతని శక్తివంతమైన బ్యాటింగ్ అనేక సార్లు జట్టును విజయపథంలో నడిపింది. ఇప్పటి వరకు జమాన్ పాకిస్థాన్ తరపున 117 మ్యాచ్లు ఆడి 108 ఇన్నింగ్స్లలో 2,385 పరుగులు సాధించాడు. ఇక ఉస్మాన్ తారిక్ను కూడా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించవచ్చని సూచనలు ఉన్నాయి. పాకిస్థాన్ జట్టులో ఇప్పటికే ఎక్కుమంది స్పిన్నర్లు ఉన్నారు.
Details
గెలిచేందుకు పక్కా వ్యూహాలు
వీరిలో సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్లతో పాటు 'మిస్టరీ' స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కెప్టెన్ అఘా సల్మాన్ అవసరమైనప్పుడు బౌలింగ్ చేయడంలో నిపుణులు. ఆర్. ప్రేమదాస్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది, అయితే ఫాస్ట్ బౌలింగ్కు కూడా ఇది సరైన స్థలం. విశ్లేషకులు సూచిస్తున్నట్లు, స్టార్టింగ్ ఓవర్లలో కోచ్, కెప్టెన్లతో సహా ఇద్దరు ప్రొఫెషనల్ ఫాస్ట్ బౌలర్లను కూడా చేర్చవచ్చని భావిస్తున్నారు. ఇలా పాక్ జట్టులో స్పిన్నర్లతో కూడిన భారీ లైనప్ ఇప్పటికే సిద్ధంగా ఉంది, మ్యాచ్ వ్యూహాలు ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ ఆధారంగా సక్రమంగా రూపొందించారు.