LOADING...
PSL 2026 Ball Tampering: పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. లీగ్ స్పిరిట్‌కు దెబ్బ
పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. లీగ్ స్పిరిట్‌కు దెబ్బ

PSL 2026 Ball Tampering: పీఎస్‌ఎల్‌లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. లీగ్ స్పిరిట్‌కు దెబ్బ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

పులిని చూసి నక్క వాత పెట్టినట్లు, పీఎస్ఎల్ (PSL) 2026 సీజన్ కూడా వివాదాల మధ్య నడుస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లో వైట్ బాల్ పింక్ బాల్‌గా మారిన వివాదం ఇప్పటికే సంచలనంగా మారగా, తాజాగా లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మరొక కొత్త వివాదానికి నిదర్శనం అయ్యింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో, లాహోర్ జట్టుకు 'బాల్ ట్యాంపరింగ్' ఆరోపణలు వచ్చాయి. దీని ఫలితంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించబడింది. హారిస్ రవూఫ్ చివరి ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని పరిశీలించి, బంతి ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్పు చెందిందని నిర్ధారించారు.

వివరాలు

ట్యాంపరింగ్ వివాదంపై సోషల్ మీడియాలో చర్చలు

ఈ నిర్ణయంతో కరాచీ కింగ్స్ లక్ష్యం 14 పరుగుల నుంచి ఒక్కసారిగా 9 పరుగులకు తగ్గింది. లాహోర్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది మైదానంలో అసహనం వ్యక్తం చేసినప్పటికీ, మ్యాచ్ అనంతరం సంయమనంగా స్పందించారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఐదు పరుగులు పెనాల్టీ విధించారు, ఇప్పుడు మేము చేయగలిగేది ఏమీ లేదని షాహీన్ చెప్పారు. ఆఖరి ఓవర్‌లో అబ్బాస్ అఫ్రిది ఫోర్, సిక్సర్‌లు బాదడంతో, డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై సోషల్ మీడియాలో చర్చలు ఊపందాయి.

Advertisement