LOADING...
ICC- Bangladesh Cricket Board: ఐసీసీ బృందంలో భారత్‌కు చెందిన అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరణ
ఐసీసీ బృందంలో భారత్‌కు చెందిన అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరణ

ICC- Bangladesh Cricket Board: ఐసీసీ బృందంలో భారత్‌కు చెందిన అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ (ICC) 2026లో జరగనున్న మెన్ టీ20 వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ అధికారుల బృందం ఢాకాకు వెళ్లాల్సి ఉండగా, భారత్‌కు చెందిన ఒక అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది. ఫలితంగా ఐసీసీ హెడ్ ఆఫ్ యాంటీ కరెప్షన్ అండ్ సెక్యూరిటీ అధికారి ఆండ్రూ ఎఫ్గ్రేవ్ మాత్రమే శనివారం ఢాకాకు వెళ్లడం జరిగింది. వీసా నిరాకరణపై ఐసీసీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఐసీసీ చొరవతో సమస్య పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, బంగ్లాదేశ్ విధానంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ కొంత అసంతృప్తికి గురైంది. టీ20 వరల్డ్‌ కప్‌ మొదటి మూడు వారాల్లో ప్రారంభం కానుంది. కాబట్టి వేదికల మార్పు అసాధ్యమే.

Details

హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రతరం

అందుచేత, సాధ్యమైనంతవరకు షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరగేలా బంగ్లాదేశ్‌ను ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఐసీసీ తుది నిర్ణయం BCB అధికారులతో సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో ఇటీవల రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో హిందువులపై వరుసగా దాడులు జరగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇలాంటి సందర్భంలో, బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను IPL మినీవేలంలో KKR రూ.9.20 కోట్లకు కొనుగోలు చేయడంపై విమర్శలొచ్చాయి. ఫలితంగా BCCI ఆదేశాలతో KKR అతడిని విడుదల చేసింది.

Details

శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ

ఈ పరిణామాల అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసి, భద్రతా కారణాల వల్ల టీ20 వరల్డ్‌ కప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ ఈ విషయంపై ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్‌ స్టేజిలో ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్‌తో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్, 17న నేపాల్‌తో ముంబై వాంఖడే స్టేడియం వేదికలపై ఆడాల్సి ఉంది.

Advertisement