Page Loader
IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా.. 
ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా..

IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్టోబర్ 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత్‌-ఎ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా, అభిమన్యు ఈశ్వరన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. భారత్-ఎ జట్టులో యువ వికెట్‌ కీపర్ ఇషాన్ కిషన్‌కు కూడా చోటు దక్కింది. ఆంధ్ర యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి,రికీ భుయ్ కూడా ఈ జట్టులో ఎంపికయ్యారు. నితీశ్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రికీ భుయ్ రంజీ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

వివరాలు 

భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా-ఎతో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు

అభిషేక్ పోరెల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యష్ దయాల్, నవదీప్ సైనీ వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా-ఎతో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే, పెర్త్‌లో సీనియర్ భారత జట్టుతో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. భారత ప్రధాన జట్టు ఆస్ట్రేలియాలో నవంబర్ 22న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం పోటీ పడనుంది, ఇది అయిదు టెస్టుల సిరీస్. గత రెండు పర్యాయాల్లో టీమిండియా ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని గెలుచుకుంది.

వివరాలు 

భారత్‌-ఎ జట్టు: 

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పోరెల్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవదీప్ సైనీ, మానవ్ సుతార్, తనుష్ కోటియన్.