Bcci: టీమిండియా 2025-26 కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025-26 సీజన్కు సంబంధించిన టీమిండియా సీనియర్ పురుషులు, మహిళల వార్షిక కాంట్రాక్టులను ఫిబ్రవరి 9 సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు టాప్ 'ఏ' కేటగిరీ దక్కగా, మహిళల విభాగంలో హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు అదే అత్యున్నత కేటగిరీ లభించింది. ఇదిలా ఉండగా, గతేడాది టెస్టు క్రికెట్కు, అంతకుముందు టీ20లకు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈసారి 'బి' గ్రేడ్కు పరిమితమయ్యారు.
వివరాలు
బి' కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
పురుషుల వార్షిక కాంట్రాక్టుల్లో 'బి' కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకోగా, 'సి' కేటగిరీలో అక్షర్ పటేల్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, రింకు సింగ్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్, సంజు శాంసన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్లకు అవకాశం కల్పించారు.