Romi Bhinder: డగౌట్లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్కు బీసీసీఐ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB) జట్టు మేనేజర్ రోమి బిందర్ (Romi Bhinder) డగౌట్లో మొబైల్ ఫోన్ వాడటం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) చర్యలు చేపట్టి, ఆయనకు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ ఘటనలో భవిష్యత్తులో ఇలాంటి నిబంధన ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ హెచ్చరించింది. ఇదే తొలి తప్పు కావడంతో బిందర్పై నిషేధం విధించలేదు. ఏప్రిల్ 10న గువాహటిలో బెంగళూరు-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్లో బిందర్ ఫోన్ చూస్తుండగా కెమెరాలకు చిక్కారు.
వివరాలు
షోకాజ్ నోటీసులు జారీ
దీనిపై సీరియస్గా స్పందించిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే బిందర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు, క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేశారు. ఆట స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఘటనను ఉదాహరణగా తీసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా పేర్కొన్నారు. 2008 నుంచి రాజస్థాన్ రాయల్స్తో అనుబంధం కలిగిన బిందర్, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి లోకల్ గార్డియన్గా వ్యవహరిస్తున్నారు. వైరల్ ఫొటోలో వైభవ్ కూడా బిందర్ ఫోన్ వైపు చూస్తూ కనిపించాడు. అయితే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, లీగ్ నిబంధనలపై మరింత అవగాహన అవసరమని బీసీసీఐ భావించింది.