Page Loader
Rishabh Pant: పంత్ గాయంపై కీలక అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ! 
పంత్ గాయంపై కీలక అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ!

Rishabh Pant: పంత్ గాయంపై కీలక అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తొలి రోజున వికెట్ల వెనుక కీపింగ్ చేస్తుండగా అతడి ఎడమచేతి చూపుడు వేళ్లకు బంతి బలంగా తాకడంతో అతనికి గాయమైంది. ఈ కారణంగా పంత్ మైదానాన్ని విడిచి వెళ్లగా, అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టాడు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ గాయం విషయంలో బీసీసీఐ తాజా సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం అతడు బోర్డు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని వెల్లడించింది. మ్యాచ్ సమయంలోనే వైద్య సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, గాయం తగ్గకపోవడంతో రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు అతడు బరిలోకి దిగలేకపోయాడని తెలిపింది.

వివరాలు 

వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్

పంత్ గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అతడు రెండో రోజు మ్యాచ్‌లో పాల్గొనలేకపోయాడని, అతడి స్థానాన్ని జురెల్ తాత్కాలికంగా భర్తీ చేస్తున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, పంత్ గాయం మరింత తీవ్రమైతే, అతడు ఈ సిరీస్‌లో మిగిలిన టెస్టులకు దూరంగా ఉండాల్సి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై బీసీసీఐ త్వరలోనే పూర్తి స్థాయి ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.