Page Loader
BCCI : నేషనల్ స్పోర్ట్స్ బిల్లులో బీసీసీఐకి చోటు.. కొత్త బిల్లుతో మారనున్న క్రికెట్ పరిపాలన విధానం
నేషనల్ స్పోర్ట్స్ బిల్లులో బీసీసీఐకి చోటు.. కొత్త బిల్లుతో మారనున్న క్రికెట్ పరిపాలన విధానం

BCCI : నేషనల్ స్పోర్ట్స్ బిల్లులో బీసీసీఐకి చోటు.. కొత్త బిల్లుతో మారనున్న క్రికెట్ పరిపాలన విధానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ప్రభావం చూపేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ క్రీడా పరిపాలన బిల్లు రూపుదిద్దుకుంటోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేకుండా స్వతంత్రంగా నడుస్తున్న బీసీసీఐ, ఇకపై నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నుంచి అధికారిక గుర్తింపు పొందాల్సిన అవసరం ఏర్పడనుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీమిండియా పాల్గొన్న తరవాత బీసీసీఐపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇండియా టుడేకి క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సమర్పించిన క్రీడా బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత బీసీసీఐ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌గా బిల్లు పరిధిలోకి వస్తుంది.

Details

అవసరమైన చట్టాన్ని సమకూర్చే ప్రయత్నం

పీటీఐ నివేదిక ప్రకారం బీసీసీఐ ఇతర నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ల మాదిరిగానే స్వయంప్రతిపత్త సంస్థగానే కొనసాగుతుంది. అయితే బోర్డు సంబంధిత వివాదాల పరిష్కారం కోసం ప్రతిపాదిత నేషనల్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌ యంత్రాంగాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ బిల్లు క్రీడా సమాఖ్యలపై ప్రభుత్వ నియంత్రణ విధించేది కాదు, కానీ సుపరిపాలనను అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చట్రాన్ని సమకూర్చే ప్రయత్నం ఇది. 2019 వరకూ బీసీసీఐకి అధికారికంగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌గా గుర్తింపు లేదు. కానీ 2020లో ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపాదిత బిల్లుతో బీసీసీఐపై కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు, నిబంధనలు వర్తించనున్నాయి.

Details

దేశ ప్రతిష్ఠను పెంపొందించేందుకు కృషి

ఇందులో వయోపరిమితి, ప్రయోజనాల సంఘర్షణ వంటి అంశాలను ఎదుర్కొనేలా లోధా కమిటీ సిఫార్సులు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ బిల్లు లక్ష్యం ఏమిటంటే క్రీడాకారుల హక్కులను పరిరక్షించడం, క్రీడల పరిపాలనలో పారదర్శకత, సమర్థత తీసుకురావడం. అలాగే 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలన్న దిశగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను పెంపొందించాలన్న ఆశయాన్ని కూడా ఈ బిల్లు ముందుంచుతోంది. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు కూడా ఈ బిల్లులోని కీలక అంశం. ఈ బోర్డుకు క్రీడా సమాఖ్యలపై చర్యలు తీసుకునే, ఫిర్యాదులపై స్పందించే అధికారాలుంటాయి.

Details

ఆధునిక వ్యవస్థను నిర్మించేందుకు సిద్ధం

అవసరమైతే స్వీయ చొరవతో సమాఖ్యలను సస్పెండ్ చేయగలదు. ఈ బోర్డుకు ప్రభుత్వ నియామకం చేసిన అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. సెలెక్షన్ ప్యానెల్‌కి క్రీడా కార్యదర్శి లేదా క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. ఇందులో అర్జున అవార్డు, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డు విజేతల నుంచి ఒకరు, జాతీయ సమాఖ్యల మాజీ అధికారులు ఇద్దరు, అథారిటీ డైరెక్టర్ జనరల్‌ను సభ్యులుగా చేర్చుతారు. ఇదంతా చూస్తే, క్రికెట్‌ను సమర్థవంతంగా పాలనలోకి తీసుకురావడమే కాక, భారత క్రీడల రంగం మొత్తం మీద ప్రభుత్వం సమగ్ర నియంత్రణతో కూడిన ఆధునిక వ్యవస్థను నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.