Vaibhav suryavamsi: చరిత్ర సృష్టించనున్న వైభవ్.. సచిన్ రికార్డు బద్దలవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
యువ ప్రతిభగా ఎదుగుతున్న వైభవ్ సూర్యవంశీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించే దశకు చేరుకున్నాడు. భారత జట్టులో అరంగేట్రం చేసే అత్యల్ప వయస్కుడిగా కొత్త రికార్డు సృష్టించే అవకాశముంది. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (16 ఏళ్ల వయసులో) పేరిట ఉంది. త్వరలో ఈ ఘనత వైభవ్ సూర్యవంశీకి దక్కే అవకాశముంది. అయితే, ఇది నిజం కావాలంటే అతడు టీమిండియా తరఫున మ్యాచ్లో ఆడాల్సి ఉంటుంది.
వివరాలు
దుమ్ములేపుతున్న చిచ్చరపిడుగు..
క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, రాబోయే ఐర్లాండ్ సిరీస్తో వైభవ్ జాతీయ జట్టులోకి రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ రూపొందించిన షార్ట్లిస్ట్లో వైభవ్ పేరు చేరినట్లు సమాచారం. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ యువ ఆటగాడు ఐపీఎల్, దేశీయ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించాడు. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ను మినహాయిస్తే, మిగతా నాలుగు మ్యాచ్లలో అతను దూకుడుగా ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు.
వివరాలు
జూన్లో ఐర్లాండ్తో సిరీస్…
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల్లోనే టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. ఇటీవల కాలంలో వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్ కోసం ఇంకా జట్టును అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎంపిక కోసం తయారు చేసిన షార్ట్లిస్ట్లో వైభవ్కు స్థానం లభించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
స్థానం దక్కడం ఖాయం..
ఒక బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, ''ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో వైభవ్కు స్థానం దక్కడం దాదాపు ఖాయం. సెలక్టర్లు అతని ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే అతను 15 ఏళ్ల వయసు నిబంధనను పూర్తి చేశాడు. ఎమర్జింగ్ ఆసియా కప్లో అతని ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది'' అని తెలిపారు. ఐర్లాండ్ సిరీస్లో అతను మెరుగైన ప్రదర్శన ఇస్తే, జింబాబ్వేతో జరగబోయే సిరీస్కు కూడా అతనికి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా, బీసీసీఐ ట్రెజరర్, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.