LOADING...
ఝార్ఖండ్ పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన బెంగాల్
155 బంతుల్లో 77 పరుగులు చేసిన అభిమన్యు ఈశ్వరన్

ఝార్ఖండ్ పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన బెంగాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022-23 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌పై ఘన విజయం సాధించి బెంగాల్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ఝార్ఖండ్ పేసర్ ఆకాశ్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టడంతో, 9 వికెట్ల తేడాతో బెంగాల్ గెలుపొందింది. బెంగాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఝార్ఖండ్ 173 పరుగులకే ఆలౌటైంది. సూరజ్ అజేయంగా 89 పరుగులు చేశాడు. బెంగాల్ తరుపున ఈశ్వరన్ (77), ఘరామి (68), షాబాజ్ అహ్మద్ (82) పరుగులు చేయడంతో 328 స్కోరు చేసింది

అభిమన్యు ఈశ్వరన్

బెంగాల్ తరుపున రాణించిన ఈశ్వరన్

తొలి ఇన్నింగ్స్ 155 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో ఝార్ఖండ్ ను 221 పరుగులకు ఆలౌట్ చేసింది. 67 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ చేతిలో తొమ్మిది వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. ఈశ్వరన్ 155 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఎఫ్‌సి క్రికెట్లో ఇంతవరకు ఎనిమిది అర్ధ సెంచరీ చేశాడు. చివరి ఆరు గేమ్‌లలో 92.25 సగటుతో 738 పరుగులతో సత్తా చాటాడు. బెంగాల్‌ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఈశ్వరన్ నిలిచాడు.