కొత్త చరిత్రను సృష్టించిన భవాని.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్లో కాంస్యం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఫెన్సర్ భవాని దేవి కొత్త చరిత్రకు నాంది పలికింది. ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన తొలి భారత ఫెన్సర్ గా గతంలో ఈ తమిళనాడు అమ్మాయి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.
తాజాగా మరో ప్రతిష్టాత్మక రికార్డును తన పేరిట రాసుకుంది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్లో తొలిసారిగా పతకం సాధించిన మొట్టమొదటి భారత ఫెన్సర్గా ఆమె చరిత్రకెక్కింది.
చైనాలో జరుగుతున్న ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది.
Details
భవానికి అభినందనలు తెలిపిన భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి
సెమీస్లో భవాని ఓడినా ఆమె కాంస్య పతకంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఈ ఛాంపియన్ షిప్స్లో ఆరంభం నుంచి కఠిన సవాళ్లను ఎదుర్కొని కాంస్యం అందుకోవడం విశేషం. తొలి రౌండ్లో భవానికి భై లభించింది. రెండో రౌండ్లో డోస్పే కరీనాపై ఆమె గెలుపొందింది.
ఫ్రీ క్వార్టర్స్ లో ఒజాకి సెరిని 15-11తో భవాని చిత్తు చేసింది. ఇక క్వార్టర్స్ లో అయితే ప్రపంచ ఛాంపియన్ షిప్ మిసాకి ఎమూరాను 15-10తో చిత్తు చేసి సత్తా చాటింది.
భారత ఫెన్సింగ్కు ఇది గర్వపడే రోజు అని, గతంలో ఎవరూ సాధించలేనిది ప్రస్తుతం భవాని సాధించిందని భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు.