NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
    ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 19, 2025
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పుకుంటుందనే వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.

    ఆసియా కప్‌తో పాటు మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనదనే వార్తలు ఇటీవల విస్తృతంగా వెలుగులోకి వచ్చాయి.

    ఈ నేపథ్యంలో దేవజిత్ సైకియా వాటిని ఖండిస్తూ స్పందించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసిన ఆయన, బీసీసీఐలో ఏసీసీ టోర్నీలలో పాల్గొనాలా, వద్దా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చే జరగలేదని చెప్పారు.

    అంతేకాకుండా ఏసీసీకి తమ వాదనను తెలిపేలా ఎటువంటి ప్రతిపాదనను కూడా పంపలేదని తెలిపారు.

    Details

    ప్రస్తుతం ఐపీఎల్ పైనే దృష్టి

    ప్రస్తుతం బీసీసీఐ దృష్టి మొత్తం ఐపీఎల్‌పై ఉందని, ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్ సిరీస్‌కి సంబంధించిన ఏర్పాట్లపైనా ఫోకస్‌ పెట్టినట్లు డ్యూస్జిత్ సైకియా స్పష్టం చేశారు.

    ఏసీసీ ఈవెంట్లను బహిష్కరిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాజనితమైనవేనని పేర్కొన్నారు. బీసీసీఐ ఏమైనా నిర్ణయం తీసుకుంటే, దానిని మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

    ఇక ఇండియా ఏసీసీ ఈవెంట్లకు దూరంగా ఉంటుందనే ఊహాగానాలకు బలం చేకూర్చిన అంశాల్లో ఒకటి - ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యం.

    వచ్చే నెలలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ నుంచి భారత్ తప్పుకున్నట్లు ఏసీసీకి ఇప్పటికే తెలియజేసిందని వార్తలొచ్చాయి.

    Details

    ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు

    అంతేకాదు సెప్టెంబరులో జరగాల్సిన పురుషుల ఆసియా కప్‌ టోర్నీకి కూడా భారత్ హాజరు కాకపోవచ్చని ప్రచారం జరిగింది. ఈ టోర్నీని వాస్తవానికి భారత్‌లో నిర్వహించాల్సి ఉంది.

    ప్రస్తుతం ఏసీసీకి చైర్మన్‌గా మోషిన్ నఖ్వీ ఉన్నారు. ఆయనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు, పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.

    ఒక పాకిస్థానీ మంత్రి ఆధ్వర్యంలో జరిగే టోర్నీల్లో భారత్ పాల్గొనదన్న వార్తలు కొన్ని మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

    అయితే బీసీసీఐ తీరుగా చూస్తే, ఇప్పటివరకు ఏసీసీ టోర్నీలపై తాము ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోలేదని స్పష్టం చేయడంతో, ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చినట్లయ్యింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్
    Shilpa shirodkar: కొవిడ్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు  బాలీవుడ్

    బీసీసీఐ

    BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు! టీమిండియా
    Yuzvendra Chahal: చాహల్‌ ఫైల్‌ను బీసీసీఐ మూసివేసింది.. మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు చాహల్
    Champions Trophy: టీమిండియా ప్లేయ‌ర్ల జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు.. బీసీసీఐ పై మండిపడిన ఐసీసీ ఐసీసీ
    Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025