NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC Team of The Year 2025: వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ICC Team of The Year 2025: వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు
    వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు

    ICC Team of The Year 2025: వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    03:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 (ICC ODI Team of The Year 2024) జాబితాను ఐసీసీ ప్రకటించింది.

    ఈ జాబితాలో ఒక్క భారత క్రికెటర్‌కి కూడా స్థానం కల్పించకపోవడం అభిమానుల మధ్య కొత్త చర్చకు దారి తీసింది.

    మొత్తం 11 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంక సారథ్యాన్ని అందజేశారు.

    ఆసక్తికరంగా, ఉపఖండ ప్రాంతానికి చెందిన 10 మంది క్రికెటర్లకు ఈ జట్టులో స్థానం దక్కింది.

    జట్టులోని ప్లేయర్ల జాబితా పరిశీలిస్తే, శ్రీలంక నుంచి నలుగురు, పాకిస్థాన్ నుంచి ముగ్గురు, అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురు, వెస్టిండీస్ నుంచి ఒకరికి అవకాశం లభించింది.

    వివరాలు 

    భారత ఆటగాళ్లకు అవకాశం లేకపోవడానికి కారణమేమిటి? 

    భారత క్రికెటర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోవడానికి ప్రధాన కారణం వారు గతేడాది చాలా తక్కువ వన్డేలు ఆడటం అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

    భారత్ కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, ఆ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది.

    టీ20 వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్‌షిప్ వంటి ప్రధాన టోర్నమెంట్లపై ఎక్కువ దృష్టి పెట్టడంతో భారత జట్టు వన్డేలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

    2023లో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు పాల్గొన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. మొదటి రెండు మ్యాచుల్లో శ్రీలంక విజయం సాధించగా, చివరి మ్యాచ్ టైగా ముగిసింది.

    వివరాలు 

    టీమ్‌ ఇదే.. 

    అదే సమయంలో, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఎక్కువగా వన్డే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడటంతో వారి ఆటతీరుకు అనుగుణంగా ఐసీసీ జట్టులో చోటు దక్కింది అని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    సైమ్ అయూబ్ (పాకిస్థాన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్), పాథున్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక), చరిత్ అసలంక (కెప్టెన్) (శ్రీలంక), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), వనిందు హసరంగ (శ్రీలంక), షహీన్ షా అఫ్రిది (పాకిస్థాన్), హారిస్‌ రవూఫ్‌ (పాకిస్థాన్), ఏఎం ఘజాన్‌ఫర్ (అఫ్గానిస్థాన్).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    ఐసీసీ

    ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ.. ఇక బ్యాటర్లకు పండగే క్రికెట్
    ICC T20I Team Of The Year 2023: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసిన ఐసిసి క్రీడలు
    Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు  రోహిత్ శర్మ
    2024 ICC Women's T20 World Cup:మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే.. టీ20 ప్రపంచకప్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025