Sakshi Mallik: బ్రిజ్ భూషణ్ గూండాలు నా తల్లిని బెదిరిస్తున్నారు: సాక్షి మాలిక్
డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గుండాల నుండి తన తల్లికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సాక్షి మాలిక్ బుధవారం ఆరోపించారు. ఇటీవల జరిగిన రెజ్లింగ్ ఎన్నికల్లో విజయం సాధించిన సంజయ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసనలు చేపట్టారు. గత రెండు మూడు రోజులుగా బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ గూండాలు యాక్టివ్గా మారారని..మా అమ్మకు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని..నా కుటుంబంలో ఒకరిపై కేసు నమోదు చేస్తామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. మా భద్రత ప్రభుత్వ బాధ్యత అని సాక్షి మాలిక్ విలేకరుల సమావేశంలో అన్నారు.బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ మినహా డబ్ల్యుఎఫ్ఐతో తనకు ఎలాంటి సమస్యలు లేవని సాక్షి పేర్కొంది.