NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం
    తదుపరి వార్తా కథనం
    Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం
    5 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా

    Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 24, 2023
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య చేధనలో టీమిండియా బ్యాటర్స్ రాణించనప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఓటమిపాలైంది.

    గార్డనర్ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. పది పరుగులు మాత్రమే వచ్చాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ కు చేరింది.

    గ్రూప్ బిలో తొలి స్థానంలో ఉనన్న ఇంగ్లండ్, గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తో రేపు తలపడనుంది. గెలిచిన జట్టు ఈ నెల 26న ఆస్ట్రేలియాతో ఫైనల్ లో ఆడనుంది.

    టీమిండియా

    కెప్టెన్ హర్మన్ ప్రీత్ రాణించినా ఫలితం లేదు

    తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 172/4 చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. బెత్ మూనీ అర్ధ సెంచరీతో రాణించింది. ఆసీస్ కెప్టెన్ లానింగ్ 34 బంతుల్లో 49* పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 28 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.

    ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 34 బంతుల్లో 52 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 43 పరుగులు చేసింది. ఒకానొక దశలో భారత్ విజయం సాధిస్తుందని భావించగా.. హర్మన్ ప్రీత్ రనౌట్ అయింది. ఇంకా చివర్లో వరుసగా వికెట్లు పడటంతో చివరికి 5 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉమెన్ టీ20 సిరీస్
    క్రికెట్

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    ఉమెన్ టీ20 సిరీస్

    8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం క్రికెట్
    ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి క్రికెట్
    ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్
    టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు క్రికెట్

    క్రికెట్

    ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే టీమిండియా
    కేఎల్ రాహుల్‌పై నాకు కోపం లేదు : మాజీ పేసర్ టీమిండియా
    ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో సుజీబేట్స్ ఫార్మామెన్స్ అదుర్స్ ఉమెన్ టీ20 సిరీస్
    కెఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్ హోదా తొలగింపు బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025