Page Loader
Delhi Capitals:ఐపీఎల్ 2025 కోసం రిషభ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం: దిల్లీ సహ యజమాని 
ఐపీఎల్ 2025 కోసం రిషభ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం

Delhi Capitals:ఐపీఎల్ 2025 కోసం రిషభ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం: దిల్లీ సహ యజమాని 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2024
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ముంగిట మెగా వేలం నిర్వహించబడబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఎంతమందిని రిటైన్‌ చేసుకోవచ్చనే విషయంలో స్పష్టత వచ్చి ఉంది. ఒక్కో ఫ్రాంఛైజీకి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవడానికి ఐపీఎల్‌ పాలకవర్గం అనుమతించింది, ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) కూడా ఉంటుంది. అందుకే, వేలానికి ముందే ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుంటుందనే విషయంపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) సహ యజమాని పార్థ్‌ జిందాల్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

రిషభ్‌ పంత్‌ను మేం ఖచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం: పార్థ్‌ జిందాల్

"మేం కచ్చితంగా ఆరుగురిని రిటైన్‌ చేసుకుంటాం. మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్‌ నియమాలపై ఇటీవల స్పష్టత వచ్చి ఉంది. కాబట్టి, జీఎంఆర్‌, మా క్రికెట్‌ ఆఫ్‌ డైరెక్టర్ సౌరభ్‌ గంగూలీతో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. రిషభ్‌ పంత్‌ను మేం ఖచ్చితంగా రిటైన్‌ చేసుకుంటాం. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెకెర్క్‌, కుల్‌దీప్ యాదవ్, అభిషేక్ పొరెల్, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌ వంటి మంచి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. వేలంలో ఏమి జరుగుతుందో చూడాలి. చర్చల అనంతరం, వేలానికి సిద్ధమవుతాం" అని పార్థ్‌ జిందాల్ చెప్పారు.

వివరాలు 

దిల్లీ క్యాపిటల్స్‌ లో 2016 నుండి ఆడుతున్న రిషభ్ పంత్ 

మరోవైపు, ఆర్సీబీలోకి రిషభ్ పంత్ వెళ్లడానికి సంప్రదింపులు జరిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచురించబడ్డాయి. దీనిని పంత్ తీవ్రంగా ఖండించాడు, ఇది తప్పుడు ప్రచారమని ఆయన చెప్పారు. 2016 నుండి రిషభ్ పంత్ దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతుండగా, 2021 నుండి అతడు డీసీ కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.