NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 
    తదుపరి వార్తా కథనం
    Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 
    పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్

    Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2024
    01:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 17వ సీజన్‌లో మళ్లీ విజయాల బాట పట్టిన దిల్లీ, గుజరాత్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

    ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 43 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

    ఈ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

    మ్యాచ్ లో విధ్వంసం సృష్టించిన పంత్‌ ఓ వ్యక్తికి సారీ చెప్పాడు. ఇంతకీ అతడెవరంటే..?

    Details 

    పంత్ ప్రవర్తన హృదయాలను గెలుచుకుంది 

    ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో పంత్ కనిపించాడు.

    ఓ బాల్ లో పంత్‌ కొట్టిన బంతి అతడికి తాకింది.

    దీంతో మ్యాచ్‌ అనంతరం పంత్ స్పందిస్తూ.. ''సారీ దేబశిశ్‌ భాయ్. నిన్ను కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు. వీలైనంత త్వరగా కోలుకుని వస్తావని ఆశిస్తున్నా'' అని ఓ వీడియోలో వ్యాఖ్యానించాడు.

    దానిని ఐపీఎల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

    పంత్ 

    పంత్ రికార్డులు 

    T20 మ్యాచ్‌లో బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా పంత్ ప్రపంచ రికార్డును సృష్టించాడు.

    పంత్ భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్ లో 18 బంతుల్లో 62 పరుగులు చేశాడు, ఇందులో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.

    ఇది ప్రపంచవ్యాప్తంగా ఏదైనా T20 మ్యాచ్‌లో బౌలర్‌పై ఏ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు.

    ఒకే ఇన్నింగ్స్‌లో ఒక బౌలర్‌పై 60+ పరుగులు చేసిన ఆటగాడి మొదటి రికార్డు కూడా.

    అదే సమయంలో, విరాట్ కోహ్లీ (ఉమేష్ యాదవ్), హషీమ్ ఆమ్లా (లసిత్ మలింగ) తర్వాత IPL చరిత్రలో ఒక బౌలర్‌పై 50+ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా పంత్ నిలిచాడు.

    గుజరాత్ 

    గుజరాత్‌ను ఓడించిన ఢిల్లీ 

    తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.

    కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో అజేయంగా 88 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 66 పరుగులు చేశాడు.

    దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 220 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 55 పరుగులు, సాయి సుదర్శన్ 39 బంతుల్లో 65 పరుగులు చేశారు.

    ఢిల్లీపై గుజరాత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు అహ్మదాబాద్‌లో కూడా ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఐపీఎల్ చేసిన ట్వీట్ 

    One of the camerapersons from our BCCI Production Crew got hit during the #DCvGT match.

    Rishabh Pant - Delhi Capitals' captain and Player of the Match - has a special message for the cameraperson. #TATAIPL | @DelhiCapitals | @RishabhPant17 pic.twitter.com/wpziGSkafJ

    — IndianPremierLeague (@IPL) April 24, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిషబ్ పంత్
    గుజరాత్ టైటాన్స్
    ఢిల్లీ క్యాపిటల్స్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రిషబ్ పంత్

    హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం క్రికెట్
    BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు క్రికెట్
    రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది క్రికెట్
    రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..! క్రికెట్

    గుజరాత్ టైటాన్స్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్
    ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా కగిసో రబడ అరుదైన ఘనత ఐపీఎల్
    మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'తో సత్తా ఐపీఎల్
    ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత ఐపీఎల్

    ఢిల్లీ క్యాపిటల్స్

    WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్ క్రికెట్
    WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025