NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?
    ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న షకీబ్

    మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 13, 2023
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది.

    ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసీఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే చివరికి జ్యూరీ షకీబ్ అల్ హాసన్ నే ఎంచుకుంది.

    అయితే మహిళల విభాగంలో రువాండాకు చెందిన యువ క్రికెటర్ హెన్రిట్టి ఇషిమ్వే ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎంపికైంది.

    షకీబ్

    రెండుసార్లు అవార్డును గెలుచుకున్న షకీబ్ అల్ హసన్

    మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో షకీబ్ అల్ హసన్ విజృంభించిన విషయం తెలిసిందే.

    అయితే 1-2తేడాతో సిరీస్ కోల్పోయిన బంగ్లా తరుపున టాప్ స్కోరర్ గా నిలిచి సత్తా చాటాడు షకీబ్.

    ముఖ్యంగా టీ20 సిరీస్ లో ఇంగ్లండ్ ను 3-0 తేడాతో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. తర్వాత ఐర్లాండ్ లోజరిగిన సిరీస్‌లోనూ షకీబ్ రాణించారు.

    మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడిన అతను 353 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 15 వికెట్లు తీశాడు. షకీబ్ ఈ అవార్డు రావడం ఇదో రెండోసారి. 2021 జూలైలో కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అతన్ని వరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    ఐసీసీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బంగ్లాదేశ్

    భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా క్రికెట్
    జనవరి 6న బీపీఎల్ సమరం క్రికెట్
    బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..! క్రికెట్
    బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ క్రికెట్

    ఐసీసీ

    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025