NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్
    తదుపరి వార్తా కథనం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్
    ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

    లీగ్‌లో మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

    దేశీయంగా భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో ఆటగాళ్ల రక్షణే ప్రాధాన్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    భారత దళాలు పాక్‌పై దాడులు చేసిన తర్వాత రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కనిపించడం వంటి ఘటనల నేపథ్యంలో పీఎస్ఎల్ స్థానాంతరం చేశారు.

    డ్రోన్ల ముప్పు నేపథ్యంలో పీసీబీ చైర్మన్, ఫ్రాంచైజీల యజమానులు, దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ మధ్య జరిగిన సమావేశాల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.

    Details

    డ్రోన్ ల కలకలంతో వాయిదా

    పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం రావల్పిండి నగరంలోని స్టేడియం సమీపంలో భారత్‌కు చెందిన 28 డ్రోన్లను పాకిస్తాన్ సైన్యం తిప్పికొట్టింది.

    ఈ డ్రోన్ల ఉద్దేశం దేశీయ, అంతర్జాతీయ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకోవడం కావచ్చని ఆయన పేర్కొన్నారు.

    కరాచీ కింగ్స్ వర్సెస్ పెషావర్ జల్మి జట్ల మధ్య రావల్పిండి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్, డ్రోన్ కలకలంతో వాయిదా పడింది.

    ప్రస్తుతం పీఎస్ఎల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొత్తం 37 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

    యూఏఈ వేదికపై మిగిలిన మ్యాచ్‌లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నదానిపై త్వరలో అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    పాకిస్థాన్

    India-Pakistan: ఉగ్రవాద నిధులను అరికట్టడానికి పాకిస్తాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌..?  భారతదేశం
    POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం  అంతర్జాతీయం
    Shehbaz Sharif: భారత్‌లో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ బ్లాక్‌  భారతదేశం
    Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025