కోహ్లీ, గంభీర్ మధ్య మళ్లీ ఫైట్.. ఇద్దరికీ భారీ ఫైన్
ఐపీఎల్ లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంబర్ గౌతమ్ గంభీర్ మధ్య మళ్లీ విబేధాలు భగ్గుమన్నాయి. ఈ ఇద్దరూ మైదానంలో గొడవకు దిగారు. లక్నోతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు మాటలు విమర్శలు చేసుకున్నారు. అనంతరం కేఎల్ రాహుల్ వారిని విడదీశారు. ఈ వివాదంపై ఐపీఎల్ యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ లకు భారీ జరిమానా విధించింది. 2.21 ప్రకారం లెవల్ 2 నేరాన్ని గంభీర్, కోహ్లీ అంగీకరించినందుకు ఇద్దరికి వందశాతం, మరోవైపు నవీన్ ఉల్ హక్ కు ఫీజులో 50శాతం జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
127 పరుగుల స్కోరును అద్భుతంగా ఢిపెండ్ చేసిన ఆర్సీబీ
లక్నోపై బెంగళూర్ జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. 127 పరుగులు ఆ స్కోరును ఆర్సీబీ అద్భుతంగా ఢిపెండ్ చేయడం విశేషం. మ్యాచ్ అనంతరం ఇరు జట్లు ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ల సమయంలో కోహ్లీ,లక్నో బౌలర్ నవీనుల్ హఖ్ మధ్య మొదట గొడవ చెలరేగింది. అయితే తనకేం సంబంధం లేకపోయినా ఈ వివాదంలో గంభీర్ తలదూర్చాడు. గంభీర్, కోహ్లీని విడిపించేందుకు ఎంత ప్రయత్నించినా వాళ్లు శాంతించలేదు. చివరకు రాహుల్, అమిత్ మిశ్రా వారిద్దరినీ విడిపించి దూరం తీసుకెళ్లారు. ఏప్రిల్ 10న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఓడిపోయినప్పుడు గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్ ను నోరు మూసుకోమని సైగ చేసిన విషయం తెలిసిందే. ఇదే ఆంశంపై ప్రస్తుతం వాగ్వాదం జరిగి ఉంటుందని చర్చ మొదలైంది.