LOADING...
Hockey: హాకీ మైదానంలో స్నేహస్ఫూర్తి.. చేతులు కలిపిన భారత్-పాక్ ఆటగాళ్లు!
హాకీ మైదానంలో స్నేహస్ఫూర్తి.. చేతులు కలిపిన భారత్-పాక్ ఆటగాళ్లు!

Hockey: హాకీ మైదానంలో స్నేహస్ఫూర్తి.. చేతులు కలిపిన భారత్-పాక్ ఆటగాళ్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, పాకిస్థాన్ మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, క్రీడా మైదానంలో ఒక హృదయాన్ని హత్తుకునే సన్నివేశం చోటు చేసుకుంది. క్రికెట్‌లో ఇటీవల కనిపించిన కఠినత్మకమైన ప్రవర్తనకు భిన్నంగా, జూనియర్ హాకీ జట్లు గట్టి స్నేహభావాన్ని చూపించాయి. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లో ఇరు దేశాల ఆటగాళ్లు పరస్పరంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ప్రేక్షకులను ఆకట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలపాటు జరిగాక, ఆటగాళ్లు హై-ఫైవ్‌లతో ఒకరికొకరు శుభాకాంక్షలు అందించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరాటం చివరకు 3-3 గోల్స్‌తో డ్రా అయ్యింది.

Details

పరస్పర కరచాలనం

మ్యాచ్ ముగిశాక కూడా ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుని స్నేహభావాన్ని ప్రదర్శించడం విశేషం. ఇప్పటివరకు ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను గౌరవంగా నిలుపుతూ, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనకు అంగీకరించలేదు. ట్రోఫీని కూడా పాక్ హోంమంత్రి చేతుల మీదుగా అందుకోవడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో, హాకీ క్రీడాకారులు ప్రదర్శించిన స్నేహపూర్వక ప్రవర్తన మరింత ప్రత్యేకతనిచ్చింది. మ్యాచ్‌కు ముందే పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) తమ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చింది.

Details

నిజమైన క్రీడా స్పూర్తికి ప్రతీక

భారత ఆటగాళ్లు కరచాలనకు అంగీకరించకపోతే కూడా, ఆటపైనే దృష్టి పెట్టి, ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ఉండాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ, మైదానంలో ఈ సూచనలకు భిన్నంగా, ఇరు జట్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించడం విశేషంగా నిలిచింది. రాజకీయ ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ హాకీ మ్యాచ్, నిజమైన క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.