LOADING...
T20 World Cup : రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!
రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!

T20 World Cup : రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఆతిథ్య దేశమైన భారత్ తమ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో రికార్డు స్థాయిలో మూడో టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా బరిలోకి దిగుతోంది. అయితే 2024లో బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన చారిత్రక జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు ఈసారి టైటిల్‌ డిఫెన్స్‌లో కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. రిటైర్మెంట్లు, వ్యూహాత్మక నిర్ణయాల నేపథ్యంలో 2026 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కని ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి

Details

రోహిత్‌ శర్మ

భారత్‌కు ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చిన కెగ్ రోహిత్‌ శర్మ తన బాధ్యతలను తదుపరి తరం చేతుల్లో పెట్టారు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను అజేయంగా చాంపియన్‌గా నిలిపిన అనంతరం రోహిత్‌ టీ20 అంతర్జాతీయాలకు గుడ్‌బై చెప్పారు. ఆయన లేని లోటు నాయకత్వంలోనూ, ఓపెనింగ్‌లోనూ భారీగానే కనిపించనుంది. ప్రస్తుతం ఆ బాధ్యతలను కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు దూకుడు బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ భుజాన వేసుకున్నారు.

Details

విరాట్‌ కోహ్లీ

2024 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన విరాట్‌ కోహ్లీ, కీలక సమయంలో భారత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రోహిత్‌ మాదిరిగానే కోహ్లీ కూడా ప్రపంచకప్‌ అనంతరం టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి యువతకు మార్గం సుగమం చేశారు. దశాబ్దానికి పైగా కోహ్లీకి సొంతమైన నంబర్‌-3 స్థానం ఇప్పుడు తిలక్‌ వర్మ వంటి యువ ఆటగాళ్లకు సవాలుగా మారింది.

Advertisement

Details

రవీంద్ర జడేజా

భారత జట్టు ప్రధాన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా కెరీబియన్‌ విజయానంతరం టీ20 అంతర్జాతీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. వేగంగా ఓవర్లు పూర్తిచేయడం, చివరి ఓవర్లలో కీలక పరుగులు సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌, తిరిగి జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ భర్తీ చేస్తున్నారు. ఇలా 2024 ప్రపంచకప్‌ విజేత జట్టులోని పలువురు సీనియర్‌ ఆటగాళ్లు తప్పుకోవడంతో, 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కొత్త ముఖాలతో, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనుంది. యువతపై పెట్టిన నమ్మకం భారత్‌కు మూడో టైటిల్‌ను అందిస్తుందా? అన్నది ఇప్పుడు క్రికెట్‌ అభిమానుల్లో ప్రధాన చర్చగా మారింది.

Advertisement