NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / chennai: ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    chennai: ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!
    ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!

    chennai: ఐపీఎల్‌ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మెట్రోలో ఉచిత ప్రయాణం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 16, 2025
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్ మ్యాచ్‌ వీక్షకుల కోసం చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ శనివారం చైన్నై సూపర్‌ కింగ్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

    ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లను తిలకించేందుకు టిక్కెట్టు ఉన్న క్రికెట్ అభిమానులు తమ నివాస ప్రాంతానికి సమీపంలోని మెట్రో స్టేషన్‌ నుంచి గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్‌ వరకు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవచ్చు.

    ఈ ప్రత్యేక సదుపాయం మ్యాచ్‌ జరుగుతున్న రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత 90 నిమిషాలు లేదా అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కొనసాగుతాయి.

    ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఆ రోజు చివరి రైలు బయలుదేరే సమయాన్ని ప్రకటిస్తారు.

    Details

    ఎంటీసీలో ప్రత్యేక సేవలు 

    చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ)తో సీఎస్‌కే భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ వెల్లడించారు.

    క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ ప్రారంభానికి 3 గంటల ముందు నుంచి నాన్‌ ఏసీ ఎంటీసీ బస్సుల్లో తమ క్రికెట్ మ్యాచ్‌ టిక్కెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

    గతేడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి 8 వేల మంది వరకు ఎంటీసీ బస్సుల సేవలను వినియోగించుకున్నారు.

    Details

    ఐపీఎల్‌ 2025 - సీఎస్‌కే హోమ్‌ మ్యాచ్‌లు 

    మార్చి 23: సీఎస్‌కే vs ముంబయి ఇండియన్స్‌ (రాత్రి 7:30)

    మార్చి 28: సీఎస్‌కే vs ఆర్సీబీ (రాత్రి 7:30)

    ఏప్రిల్‌ 5: సీఎస్‌కే vs డీసీ (మధ్యాహ్నం 3:30)

    ఏప్రిల్‌ 11: సీఎస్‌కే vs కేకేఆర్‌ (రాత్రి 7:30)

    ఏప్రిల్‌ 25: సీఎస్‌కే vs ఎస్‌ఆర్‌హెచ్‌ (రాత్రి 7:30)

    ఏప్రిల్‌ 30: సీఎస్‌కే vs పీబీకేఎస్‌ (రాత్రి 7:30)

    మే 12: సీఎస్‌కే vs ఆర్‌ఆర్‌ (రాత్రి 7:30)

    ఈ తేదీల్లో క్రికెట్ అభిమానులు మెట్రో రైలు, ఎంటీసీ బస్సుల సేవలను వినియోగించుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    చైన్నై సూపర్ కింగ్స్

    తాజా

    MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌ ఆస్ట్రేలియా
    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌

    ఐపీఎల్

    Mallika Sagar: ఐపీఎల్‌ మెగా వేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లిక సాగర్‌ క్రికెట్
    IPL 2025 Mega Auction : గుజరాత్‌కు సిరాజ్‌.. హైదరాబాద్‌కు షమీ.. ఐపీఎల్‌ వేలంలో రికార్డు బిడ్డింగ్‌! సన్ రైజర్స్ హైదరాబాద్
    Venkatesh Iyer: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలోకి వెంకటేశ్ అయ్యర్ క్రికెట్
    IPL 2025 auction:వేలంలో అమ్ముడైన,అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే! క్రీడలు

    చైన్నై సూపర్ కింగ్స్

    IPL 2023: బౌండరీలతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం.. చైన్నై భారీ స్కోరు ఐపీఎల్
    IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు  బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే  ఐపీఎల్
    మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు  ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025