NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!
    ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

    IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రారంభం కావచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నా ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో పాటు పలువురు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు మళ్లీ భారత్‌కు రాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    మే 16న టోర్నీని తిరిగి ప్రారంభించి, మే 30న ఫైనల్ నిర్వహించాలన్న యత్నాల్లో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.

    ఐపీఎల్‌ నిలిపివేసిన వెంటనే మిచెల్ స్టార్క్ తన భార్య అలిస్సా హీలీతో కలిసి సిడ్నీకి వెళ్లిపోయాడు. అక్కడికి చేరుకున్న స్టార్క్ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు.

    అయితే, అతని మేనేజర్ మాట్లాడుతూ.. టోర్నీ తిరిగి ప్రారంభమైనా స్టార్క్ భారత్‌కు తిరిగి రావడం అనుమానాస్పదమేనని వ్యాఖ్యానించాడు.

    Details

    ఆసీస్ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు

    ఇక, ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ పత్రిక ప్రకారం, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ ఆటగాళ్లు ఐపీఎల్‌కు తిరిగి వెళ్లకపోయినా పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది.

    పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి కీలక ఆటగాళ్లపై కూడా సందేహాలు నెలకొన్నాయి.

    వీరి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయినందున, జూన్ 11న లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు సిద్ధమయ్యేందుకు స్వదేశంలోనే ఉండాలని ఈ ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    Details

    24 గంటల్లోనే భారత్ ను విడిచి వెళ్లిన ప్లేయర్లు

    ఐపీఎల్ సస్పెన్షన్‌కు గడచిన 24 గంటల్లోనే అనేక మంది విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భారత్‌ను విడిచి వెళ్లిపోయారు.

    వీరిని తిరిగి రప్పించడమే ఇప్పుడు ఆర్గనైజర్లకు అతిపెద్ద సవాలుగా మారింది.

    న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇప్పటికే తమ దేశానికి చేరుకోగా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం మే 25 వరకు మంజూరు చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అనంతరం తమ ఆటగాళ్లను కొనసాగించాలా, వద్దా అనే విషయంలో చర్చించనుంది.

    ఆటగాళ్ల భద్రతే ప్రాధాన్యమని CSA స్పష్టంగా తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    ఆస్ట్రేలియా

    తాజా

    IPL 2025: ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆసీస్ ఆటగాళ్ల ఆడడంపై అనుమానాలు! ఐపీఎల్
    After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి జమ్ముకశ్మీర్
    Options Trading: ఎఫ్‌ అండ్‌ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్ల జోరు సెబీ
    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్

    ఐపీఎల్

    IPL 2025: ఐపీఎల్‌ 2025 గేమ్‌ చేంజర్లు వీరే.. ఎవరు ఏ లిస్టులో ముందున్నారంటే?  క్రికెట్
    CSK: చైన్నైకి ఫ్లే ఆఫ్స్ ఛాన్సుందా?.. ఇలా జరిగితే సాధ్యమే! చైన్నై సూపర్ కింగ్స్
    Champak: చంపక్ ఎంట్రీతో ఐపీఎల్‌లో కొత్త హంగామా.. దీని ప్రత్యేకతలివే! క్రికెట్
    IPL 2025: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు రాజస్థాన్ రాయల్స్

    ఆస్ట్రేలియా

    IND Vs AUS: కోహ్లీ, కాన్‌స్టాస్‌ మధ్య వాగ్వాదం.. చర్యలు తీసుకోవాలని కోరిన పాంటింగ్‌, మైకెల్ వాన్ విరాట్ కోహ్లీ
    Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టులో ఖలిస్థానీ మద్దతుదారుల కలకలం టీమిండియా
    AUS vs IND: మెల్‌బోర్న్ టెస్టులో టెయిలెండర్ల అడ్డుకట్ట.. ఆసీస్ స్కోరు 228/9 భారత జట్టు
    AUS vs IND : టీమిండియా ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాదే మెల్‌బోర్న్ టెస్టు టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025