NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?
    తదుపరి వార్తా కథనం
    వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?
    మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో భారత్ ఓడించింది

    వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 18, 2023
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ 267 పాయింట్లతో టీ20లో ప్రస్తుతం ఆగ్రస్థానంలో నిలిచింది. అలాగే వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో ఫస్ట్ ప్లేస్ సాధించడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. త్వరలోనే టీ20 సిరీస్ కూడా ఉంది. తరువాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లను భారత్ ఆడనుంది.

    టెస్టులో ఆస్ట్రేలియా (126) పాయింట్లతో ఫస్ట్ స్థానంలో కొనసాగుతుండగా... భారత్ (115) పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వన్డే ర్యాకింగ్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది.

    న్యూజిలాండ్‌తో జరగుతున్న వన్డే‌ సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధిస్తే భారత్, వన్డేలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ వన్డేలో 117 పాయింట్లతో మొదట్లో నిలవగా.. భారత్ 110 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

    భారత్

    ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ సాధిస్తే మొదటి స్థానం

    టెస్టులో ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 115 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. టెస్టు ర్యాంక్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలవాలంటే ఆసీస్‌పై 2-0 తేడాతో భారత్ గెలవాలి.

    2022లో మార్చిలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను 2-0తో భారత్ వైట్‌వాష్ చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది తొలి టెస్టు సిరీస్ విజయం. భారత్ స్వదేశంలో కేవలం ఒక టెస్టు సిరీస్ మాత్రమే ఆడింది. ఏడాది చివర్లో, బంగ్లాదేశ్‌ను భారత్ వారి దేశంలోనే ఓడించింది

    శ్రీలంకను ​​2-0తో ఓడించిన తర్వాత, స్వదేశంలో భారత్ వరుసగా 15వ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. భారత్ చివరి సారిగా ఫిబ్రవరి 2021లో స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    క్రికెట్

    టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం జస్పిత్ బుమ్రా
    వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం శ్రీలంక
    ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం ఆస్ట్రేలియా
    రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025