LOADING...
First stadium in the World: క్రికెట్‌కు ప్రతీకగా నిలిచిన లార్డ్స్‌.. మరో అరుదైన రికార్డు
క్రికెట్‌కు ప్రతీకగా నిలిచిన లార్డ్స్‌.. మరో అరుదైన రికార్డు

First stadium in the World: క్రికెట్‌కు ప్రతీకగా నిలిచిన లార్డ్స్‌.. మరో అరుదైన రికార్డు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 04, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన మైదానం ఏదైనా ఉందంటే అది లార్డ్స్‌ స్టేడియమే. ప్రస్తుతం ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ఇక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా లార్డ్స్‌ ఒక విశిష్టమైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోని ఇతర క్రికెట్‌ మైదానాలు ఇప్పటికీ అందుకోలేని ఘనతను ఇది సొంతం చేసుకుంది.

వివరాలు

లార్డ్స్‌లో 150వ టెస్ట్ మ్యాచ్..

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు మైదానాల్లో మాత్రమే 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. వాటిలో అత్యధిక టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన మైదానంగా లార్డ్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, 150 టెస్టు మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న తొలి, ఏకైక క్రికెట్‌ వేదికగా కూడా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ప్రస్తుత మ్యాచ్‌ లార్డ్స్‌లో నిర్వహిస్తున్న 150వ టెస్టు కావడం విశేషం.

వివరాలు

భారత్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు వేదికైన ఈడెన్ గార్డెన్స్..

లార్డ్స్‌ తర్వాత అత్యధిక టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన మైదానాల జాబితాలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ రెండో స్థానంలో ఉంది. అక్కడ ఇప్పటివరకు 118 టెస్టు మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. మూడో స్థానంలో ఉన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో 114 టెస్టులు జరిగాయి. భారత్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు వేదికైన మైదానం ఈడెన్ గార్డెన్స్. కోల్‌కతాలోని ఈ చారిత్రాత్మక స్టేడియంలో ఇప్పటివరకు 43 టెస్టు మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. భారతదేశంలో ఇదే అత్యధిక సంఖ్య కావడం ప్రత్యేకత. ఆ తర్వాత ఎం.ఎ.చిదంబరం స్టేడియం (చెపాక్‌) 35 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది.

Advertisement