LOADING...
ICC: టెస్టు క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం.. పింక్ బాల్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్
టెస్టు క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం.. పింక్ బాల్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్

ICC: టెస్టు క్రికెట్‌లో కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం.. పింక్ బాల్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టెస్టు క్రికెట్‌లో పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్‌కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్‌గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది.

వివరాలు

పింక్ బాల్ ట్రయల్‌కు షరతులతో అనుమతి

ఐసీసీ ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ముందుగా పరిశీలించాయి. టెస్టు క్రికెట్‌లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

వివరాలు

ఆట సమయాన్ని పెంచే ప్రయత్నం

అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్‌కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది మరియు తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్‌కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్‌గా చూస్తున్నారు. హాక్-ఐ డేటాకు మ్యాచ్ అధికారులకు అనుమతి సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .

Advertisement

వివరాలు

వన్డేల్లో కోచ్‌లకు కొత్త అవకాశం

ఇక వన్డే మ్యాచ్‌లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్స్ బ్రేక్‌లు ఉండటంతో కోచ్‌లు మ్యాచ్‌లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్‌లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్‌లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

వివరాలు

లెగ్-సైడ్ వైడ్ రూల్‌కు శాశ్వత ఆమోదం

ఐసీసీ లెగ్-సైడ్ వైడ్‌పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే MCC క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరికొన్నికీలక నిర్ణయాలివే క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్‌లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-A పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్‌లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పుల దిశగా ICC ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Advertisement