NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్
    తదుపరి వార్తా కథనం
    ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్
    ఐదుసార్లు ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళలు

    ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది.

    2020 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళలు ఈసారీ ఎలాగైనా ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 12న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో పోరుకు సిద్ధమైంది.

    గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.

    గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్లు ఫైనల్‌లో పోటీ పడుతాయి. ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరగునుంది.

    టీమిండియా

    ప్రపంచ కప్‌పై కన్నేసిన టీమిండియా

    హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2020లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా కప్‌ను అందుకుంది. స్పిన్ విభాగంలో దీప్తిశర్మ, రేణుకా సింగ్‌తో టీమిండియా బలంగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ భారీ పరుగులు సాధిస్తే టీమిండియా విజయాన్ని సాధించే అవకాశం ఉంది.

    ఆస్ట్రేలియా జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. అలిస్సా హీలీ, కెప్టెన్ మెగ్ లానింగ్, ఆల్-రౌండర్లు తహ్లియా మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ అద్భుతంగా ఆడుతున్నారు. ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20ల్లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా 2-0తో ఓడించింది.

    న్యూజిలాండ్ రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2018, 2020లో మొదటి రౌండ్లలోనే న్యూజిలాండ్ నిష్క్రమించింది. ఈసారి ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ కసిగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉమెన్ టీ20 సిరీస్
    క్రికెట్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఉమెన్ టీ20 సిరీస్

    8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం క్రికెట్
    ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి క్రికెట్

    క్రికెట్

    ధోని చూస్తుండగా వారెవ్వా అనిపించిన ఇషాన్ కిషన్ టీమిండియా
    సూపర్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్ ఇంగ్లండ్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం ఐసీసీ
    రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025