NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్
    తదుపరి వార్తా కథనం
    పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్
    ఆసియా కప్ వివాదం గురించి మాట్లాడిన పీసీబీ చైర్మన్ నజాం సౌథీ

    పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 14, 2023
    03:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్ 2023 టోర్ని వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా లేదు. పాకిస్తాన్ లో ఆసియా కప్ 2023 టోర్ని జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి టీమిండియా వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నిని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన విషయం తెలిసిందే.

    ఆసియాకప్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కి రాకపోతే పాక్ టీమ్ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఇండియాకి వెళ్లదని అప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్‌రాజా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. దీనిపై ప్రస్తుత చైర్మన్ నజాం సౌథీ స్పందించారు.

    ఈ విషయంలో ఉన్న ఆప్షన్లు అన్నింటినీ పట్టించుకొని స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఈ అంశంపై ఐసీసీ సమావేశాల్లో చర్చిస్తామని నజాంసౌథీ వెల్లడించారు.

    ఇండియా

    ఇండియా ప్రతిపాదనను ఒప్పుకోం

    మిగిలిన అన్ని జట్లు పాకిస్తాన్‌కు వస్తున్నప్పుడు, టీమిండియాకు రావడానికి భయపడడం దేనికని, అలాగే తమ జట్టును భారత్‌కు పంపిస్తే భద్రతా సమస్యలొస్తాయని, తాను ఈ విషయంపై రాబోయే సమావేశాల్లో చర్చకు తీసుకొస్తామని నజాం సౌథీ వెల్లడించారు.

    తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహించాలనే ఇండియా ప్రతిపాదనను తాము ఒప్పుకోమని, ఇది ఆసియా కప్, వరల్డ్ కప్‌తో ఆగదని, తమ ప్రభుత్వం కూడా ఆసియా కప్ ఇక్కడే నిర్వహించాలని అనుకుంటోందని సౌథీ పేర్కొన్నారు.

    ఈ ఆసియా కప్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    పాకిస్థాన్

    స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది క్రికెట్
    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు క్రికెట్
    టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ క్రికెట్
    పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్ క్రికెట్

    క్రికెట్

    IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..! టీమిండియా
    ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్ టీమిండియా
    టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025