BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది. వన్డే, టీ20, టెస్టు క్రికెట్ హక్కులను విక్రయించడం ద్వారా ఏటా కొన్ని కోట్ల రూపాయాలను ఆర్జిస్తోంది. ఇక ఐపీఎల్కు సంబంధించి హక్కుల విషయంలోనూ భారీగానే సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతేడాది బోర్డుకు వేల కోట్లలో ఆదాయం వస్తోంది. అయితే అంతే స్థాయిలో బోర్డు ప్రభుత్వానికి ఆదాయ పన్ను కడుతోంది. బీసీసీఐ 2021-22 సంవత్సరానికి రూ.1,159 కోట్ల ట్యాక్స్ ను ప్రభుత్వానికి చెల్లిస్తోందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఈ పన్ను అంతకుముందు కంటే 37శాతం అధికమని తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం వివరాలివే
2020-21లో బీసీసీఐ 7,606 కోట్లు ఆదాయం సంపాదించగా.. రూ.3064 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం వివరాలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.815.08 కోట్లు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.882.29 కోట్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,159 కోట్లు