LOADING...
IND vs AUS 2nd T20I :మెల్‌బోర్న్‌లో నేడు భారత్,ఆస్ట్రేలియా రెండో టీ20.. రికార్డులు ఏం చెబుతున్నాయంటే ?
రికార్డులు ఏం చెబుతున్నాయంటే ?

IND vs AUS 2nd T20I :మెల్‌బోర్న్‌లో నేడు భారత్,ఆస్ట్రేలియా రెండో టీ20.. రికార్డులు ఏం చెబుతున్నాయంటే ?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ మైదానంలో జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ భారత ఇన్నింగ్స్‌లో కేవలం 9.4 ఓవర్లు మాత్రమే పూర్తవగానే వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ పూర్తిగా రద్దయింది.ఇప్పుడు ఇరు జట్లు సిరీస్‌లోని రెండో టీ20 పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ నేడు చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో (MCG) జరగనుంది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఈరోజు మ్యాచ్ గెలిచి ఆధిక్యం సాధించాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చారిత్రాత్మక మైదానం 

భారత కాలమానం ప్రకారం రెండో టీ20 మ్యాచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1.15 గంటలకు జరుగుతుంది. మొదటి మ్యాచ్ రద్దు కావడంతో ఇప్పుడు సిరీస్‌లో నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేటి మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్ విజయంలో పెద్ద ఆధిక్యం లభిస్తుంది. అందువల్ల ఇరు జట్లు ఈ పోరులో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని కట్టుదిట్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగనున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చారిత్రాత్మక మైదానాలలో ఒకటి. ఈ మైదానంలో భారీ షాట్లు కొట్టడం సులభం కాదు కాబట్టి బ్యాట్స్‌మెన్లకు ఇది కొంత సవాలుగా ఉంటుంది.

వివరాలు 

ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు

భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ మైదానంలో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో హెడ్‌ టు హెడ్‌ రికార్డు ప్రకారం ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచింది, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ 2008లో జరిగింది. అందులో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం 2012, 2016లో భారత జట్టు ఆడిన టీ20 మ్యాచ్‌లను గెలుచుకుంది. 2018లో జరిగిన మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది.

వివరాలు 

నేటి మ్యాచ్‌కు ఇరు జట్లలో మార్పులు అనుమానమే

మెల్‌బోర్న్ మైదానంలో భారత జట్టు మంచి రికార్డును కలిగి ఉంది. ఆస్ట్రేలియాతో పాటు జింబాబ్వే, పాకిస్తాన్‌లతో కూడా ఇక్కడ పోటీ పడింది. జింబాబ్వే, పాకిస్తాన్‌పై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు గెలిచింది. మొత్తంగా ఈ మైదానంలో భారత్ ఆడిన ఆరు టీ20 మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది, ఒకదాంట్లో మాత్రమే ఓటమి చవిచూసింది. మరోవైపు, ఆస్ట్రేలియా ఈ మైదానంలో ఇప్పటివరకు 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో తొమ్మిది గెలిచి ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. నేటి మ్యాచ్‌లో జట్లలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. మొదటి మ్యాచ్‌లో ఆడిన అదే ఆటగాళ్లు ఈరోజు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది.