NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం 
    తదుపరి వార్తా కథనం
    Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం 
    రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం

    Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు,రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది.

    ఇప్పటివరకు భారత జట్టు మొత్తం ఆధిక్యం 308 పరుగుల వద్ద ఉంది.ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (5) నిరాశపరిచాడు,అలాగే యశస్వి జైస్వాల్ (10)విరాట్ కోహ్లీ (17)కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

    ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (33),రిషభ్ పంత్ (12)ఉన్నారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీస్తే, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

    బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

    వివరాలు 

    భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా విలవిల

    టీమిండియా పేస్ దాడికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పోరాడలేకపోయారు.జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దళం కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

    బుమ్రా తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ షద్మాన్ (2)ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

    ఆ తర్వాత, ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో జకీర్ హసన్ (3), మోమినల్ హక్ (0)లను ఔట్ చేశాడు.

    కెప్టెన్ షాంటో (20) కాసేపు క్రీజులో నిలిచినప్పటికీ, భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా వికెట్లు వరుసగా కోల్పోయింది.

    వివరాలు 

    రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్‌తో రెండు వికెట్లు 

    షాంటో, ముష్ఫికర్ రహీమ్ (8) ఔటైన వెంటనే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందని అందరూ భావించారు.

    అయితే, షకీబ్ అల్ హసన్ (32), లిటన్ దాస్ (22) ఆరో వికెట్‌ కోసం 51 పరుగులు జోడించి దెబ్బతిన్న ఇన్నింగ్స్‌ను కాసేపు నిలబెట్టారు.

    రవీంద్ర జడేజా తన అద్భుతమైన బౌలింగ్‌తో వారిద్దరిని ఔట్ చేయడంతో భారత్‌కు మళ్లీ పైచేయి సాధించింది.

    మెహదీ హసన్ మిరాజ్ (27) కొద్దిసేపు పోరాడినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    టీమిండియా

    Team India: టీ20 ప్రపంచకప్ విజేతల రాక కోసం అభిమానుల ఎదురు చూపులు.. ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు క్రీడలు
    T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు  టీ20 ప్రపంచకప్‌
    PM Modi: మోదీని కలిసిన టీమ్​ఇండియా - ప్లేయర్స్​తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని  నరేంద్ర మోదీ
    IND vs SL: భారత జట్టు శ్రీలంక పర్యటన.. టీ20 కెప్టెన్‌గా ఎవరు? క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025