NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Team India: ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!
    ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!

    Team India: ఇంగ్లండ్ వెళ్లేందుకు భారత్-ఎ జట్టు సిద్ధం.. మే 25న తొలి బృందం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందుగా, భారత సీనియర్ జట్టుకు అవసరమైన సన్నాహకాలను అందించేందుకు భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది.

    భారత్-ఎ జట్టు తొలి బృందం మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లను ప్రారంభించింది.

    ఈ పర్యటనలో భాగంగా, భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లను ఆడనుంది. మే 30న క్యాంటర్‌బరీ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

    సీనియర్ జట్టు ఇంగ్లండ్‌తో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుండగా, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్‌లు కీలకమవుతాయని అంచనా.

    Details

    జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం

    అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఎంపిక చేసిన ఆటగాళ్ల వివరాలను బీసీసీఐ సేకరించి లాజిస్టిక్స్ ప్రక్రియ వేగవంతం చేసింది.

    ఐపీఎల్ నాకౌట్ దశకు చేరుకోని ఆటగాళ్లు ముందుగా మే 25న బయలుదేరే జట్టులో ఉంటారని, మిగిలిన వారు తమ ఐపీఎల్ బాధ్యతలు ముగిసిన తర్వాత జట్టుతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

    టెస్ట్ సిరీస్ ఆడనున్న ప్రధాన జట్టు ఆటగాళ్లు జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నది.

    కొంతమంది సీనియర్ ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌కు బదులుగా రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆడాలని అనుకుంటున్నారని సమాచారం.

    Details

    ముందుగా వెళ్లనున్న ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్

    ఈ నిర్ణయం వారి ఐపీఎల్ ప్రదర్శన, మెడికల్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

    గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ముందుగా వెళ్లి అక్కడి 'ఎ' జట్టుతో మ్యాచ్‌లు ఆడారు.

    ఐపీఎల్ సీజన్ తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి, కోలుకునే సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

    ఈ వేసవిలో, భారత్-ఎ జట్టు, భారత అండర్-19 జట్టు, మహిళల జట్టు మరియు మిక్స్‌డ్ డిజేబిలిటీ జట్లు ఇంగ్లండ్‌లో పర్యటించనున్నాయి.

    భారత మహిళల జట్టు ఐదు టీ20లు మరియు మూడు వన్డేలు ఆడనుండగా, అండర్-19 జట్టు ఐదు వన్డేలు, రెండు టెస్టుల్లో పాల్గొంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    ఇంగ్లండ్

    తాజా

    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్
    DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు భారతదేశం
    Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్! కోవిడ్
    LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

    టీమిండియా

    IND vs NZ: టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం! రోహిత్ శర్మ
    Mohammed Shami: మహ్మద్ షమీకి విశ్రాంతి.. న్యూజిలాండ్‌ మ్యాచులో అర్షదీప్‌కి ఛాన్స్! మహ్మద్ షమీ
    IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్.. సెమీస్‌ ప్రత్యర్థి తేలేదీ నేడే!  న్యూజిలాండ్
    Sunil Gavaskar: కివీస్‌ను ఓడించి ఆసీస్‌తోనే భారత్ సెమీస్‌ ఆడాలి: సునీల్‌ గావస్కర్  సునీల్ గవాస్కర్

    ఇంగ్లండ్

    Joe Root : సచిన్ అల్ టైం రికార్డుకు చేరువలో జో రూట్  సచిన్ టెండూల్కర్
    Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు క్రికెట్
    Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ గుడ్ బాయ్  క్రీడలు
    Travis Head: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్! ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025