LOADING...
IndW Vs AusW : ఆసీస్ టెస్ట్‌కు ముందు టీమిండియాలో మార్పు.. రేణుకాకు విశ్రాంతి, కశ్వీకి అవకాశం
రేణుకాకు విశ్రాంతి, కశ్వీకి అవకాశం

IndW Vs AusW : ఆసీస్ టెస్ట్‌కు ముందు టీమిండియాలో మార్పు.. రేణుకాకు విశ్రాంతి, కశ్వీకి అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన సెలెక్టర్లు,ఆమె స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. రేణుకాపై పని భారం ఎక్కువగా ఉండటంతో ఆమెకు విరామం ఇచ్చినట్లు సెలెక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకు రేణుకా సింగ్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడినా కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించింది. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మూడు టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసుకోగా,రెండు వన్డేల్లో కేవలం ఒక వికెట్ మాత్రమే దక్కింది.

వివరాలు 

కశ్వీ గౌతమ్ కి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్

ఆమె ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా,జట్టులో అనుభవజ్ఞురాలైన పేసర్‌గా ఉండటం వల్ల ఇప్పుడు ఆమె లేకపోవడం భారత పేస్ దళానికి కొంత లోటుగా మారే అవకాశం ఉంది. కశ్వీ గౌతమ్ విషయానికి వస్తే, ఆమెకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు ఆమె ఆరు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు 68పరుగులు కూడా చేసింది. అయితే రేణుకాతో పోలిస్తే కశ్వీకి అంత అనుభవం లేకపోవడంతో ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకు సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. భారత పేస్ దళంలో కశ్వీతో పాటు క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే, అమంజోత్ కౌర్ కూడా టెస్ట్ స్థాయిలో పెద్దగా అనుభవం లేని బౌలర్లే.

వివరాలు 

మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు

ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత పేసర్లు ఎంతవరకు అడ్డుకోగలరన్నది ఆసక్తికరంగా మారింది. మార్చి 6న పెర్త్‌లోని WACA మైదానంలో ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పింక్ బాల్‌తో జరిగే ఈ పోరు డే-అండ్-నైట్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఇక భారత మహిళల జట్టు ప్రస్తుతం మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో మొదట జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది.

Advertisement

వివరాలు 

మార్చి 6న ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్

అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో చివరి పోరుగా ఉండే ఏకైక టెస్ట్ మ్యాచ్ మార్చి 6న ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఆస్ట్రేలియా 8-4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు నాలుగు పాయింట్లు కేటాయించారు. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు..

స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌, ప్రతీక రావల్‌, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), అమన్‌జోత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, రిచా ఘోష్‌, ఉమా ఛెత్రి, క్రాంతి గౌడ్‌, కశ్వీ గౌతమ్‌ ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్‌లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్‌ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్‌గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్

Advertisement