LOADING...
Team India: స్వదేశంలో భారత్‌కు మరచిపోలేని చెత్త రికార్డు
స్వదేశంలో భారత్‌కు మరచిపోలేని చెత్త రికార్డు

Team India: స్వదేశంలో భారత్‌కు మరచిపోలేని చెత్త రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ముల్లన్‌పూర్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, తొలి మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ను గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆరంభం నుంచే దాటిగా ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మాత్రమే సమర్థవంతంగా బౌలింగ్ చేయగా, మిగతావారు భారీ పరుగులు సమర్పించారు.

Details

స్వదేశంలో   అత్యంత చెత్త రికార్డు 

214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కీ ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ ఉన్నప్పటికీ, తిలక్ వర్మ ఒంటరిగా పోరాడటం తప్ప ఎవరి నుంచీ పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. భారీ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమవడంతో టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో టీమిండియా స్వదేశంలో పరుగుల పరంగా తమకే అతిపెద్ద టీ20 పరాభవాన్ని నమోదుచేసుకుంది. ఇప్పటివరకు 2022లో దక్షిణాఫ్రికా చేతిలో 49 పరుగుల తేడాతో ఓడిన రికార్డు ఉంటే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అదే రికార్డును మరల బద్దలుకొట్టింది.

Details

టీ20ల్లో భారత్‌కు పరుగుల పరంగా 5 అతిపెద్ద పరాజయాలు 

ముల్లన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల ఓటమి ఇండోర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 49 పరుగుల పరాజయం నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్ చేతిలో 47 పరుగుల ఓటమి రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్ చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమి నాగ్‌పూర్‌లో శ్రీలంక చేతిలో 29 పరుగుల పరాభవం మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచిన నేపథ్యంలో, వచ్చే మ్యాచ్‌ల్లో జట్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement