
ENG vs IND : రెండో టెస్టుకు ముందు భారత్కు ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఓటమితో ప్రారంభించిన భారత్.. ప్రస్తుతం 0-1తో వెనుకంజలో ఉంది. జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు కీలకంగా మారిన బౌలింగ్ విభాగంలో మార్పులు జరగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. జస్పిత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఫిట్నెస్ అంశాలు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అతడిని మొదటి మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని మేనేజ్మెంట్ ముందే నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాటి ప్రాక్టీస్ సెషన్లో బుమ్రా పాల్గొనకపోవడంతో ఆయన జట్టులో లేనే అనుమానాలు దాదాపు ఖరారయ్యాయి.
Details
ప్రాక్టీస్ కు దూరంగా బుమ్రా
ఇక బుమ్రాతో పాటు తొలి టెస్టులో 5 వికెట్లు తీసినప్పటికీ 6కి పైగా ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా శుక్రవారం నెట్ సెషన్కు దూరంగా ఉన్నారు. ఈపరిస్థితుల్లో టీమిండియా మేనేజ్మెంట్ కొత్త బౌలింగ్ కాంబినేషన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ సెషన్లో పేసర్లు అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్లతో కోచ్ గౌతమ్ చర్చించిన దృశ్యాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. వీరిలో ఒకరిని కాకుండా.. ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టులో లేకపోతే.. ఈ ఇద్దరికి రెండో టెస్టులో ఆడే అవకాశముందని భావిస్తున్నారు. అదే జరిగితే.. అర్ష్దీప్ సింగ్కు ఇది టెస్టు అరంగేట్రంగా నిలవనుంది. ఈపేస్ మార్పులతో టీమిండియా రెండో టెస్టులో ప్రత్యర్థిపై పైచేయి సాధించగలుగుతుందా అనే ప్రశ్నపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.