NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Paris Olympics 2024: సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. 3-2తో మ్యాచ్‌ను గెలిచిన జర్మనీ 
    తదుపరి వార్తా కథనం
    Paris Olympics 2024: సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. 3-2తో మ్యాచ్‌ను గెలిచిన జర్మనీ 
    సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు

    Paris Olympics 2024: సెమీ-ఫైనల్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. 3-2తో మ్యాచ్‌ను గెలిచిన జర్మనీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 07, 2024
    08:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిస్ ఒలింపిక్స్ 2024 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఓడిపోయింది.

    ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జర్మనీ 3-2తో భారత్‌పై విజయం సాధించింది. ఈ ఓటమి ఎదురైనప్పటికీ, భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌ను ఆడనుంది.

    మరోవైపు స్వర్ణ పతకం కోసం జర్మనీ జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

    భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ చెరో గోల్ చేశారు.

    ఈ ఆసక్తికరమైన మ్యాచ్‌పై ఓ లుక్కేద్దాం.

    వివరాలు 

    తొలి అర్ధభాగంలో జర్మనీ 2-1 ఆధిక్యంలో నిలిచింది 

    మ్యాచ్ ఆరంభం నుంచి భారత జట్టు దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో మ్యాచ్ 7వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేశాడు.

    ఆ తర్వాత తొలి క్వార్టర్‌ వరకు మరో గోల్‌ నమోదు కాలేదు. సెకండాఫ్‌లో జర్మనీకి చెందిన గొంజలో పెయిలట్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేశాడు.

    తొలి అర్ధభాగం ముగియడానికి కొద్ది సేపటి ముందు జర్మనీకి చెందిన క్రిస్టోఫర్ రూర్ పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.

    వివరాలు 

    ఆసక్తికరంగా సాగిన సెకండాఫ్ 

    తొలి అర్ధభాగంలో వెనుకబడిన భారత జట్టు.. మూడో క్వార్టర్‌లో జోరుగా ఆడుతూ.. నిరంతరంగా దాడి చేసింది. మ్యాచ్ 36వ నిమిషంలో సుఖ్‌జిత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ గోల్‌ చేసి భారత్‌ను 2-2తో సమం చేశాడు.

    మూడో క్వార్టర్‌లో భారత్‌ ఆధిపత్యం చెలాయించడంతో జర్మనీ నుంచి ఎలాంటి గోల్స్‌ చెయ్యలేదు.

    నాలుగో క్వార్టర్‌లో మార్కో మిల్ట్‌కౌ ఫీల్డ్ గోల్‌తో జర్మనీకి ఆధిక్యాన్ని అందించాడు.

    వివరాలు 

    ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది 

    ఇక ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో జర్మనీ తలపడనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డచ్ జట్టు స్పెయిన్‌ను 4-0 తో ఓడించింది. కాంస్య పతక పోరులో భారత్ స్పెయిన్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఆగస్టు 8న జరగనున్నాయి.

    వివరాలు 

    భారత హాకీ జట్టు 13వ ఒలింపిక్ పతకాన్ని ఛేదించింది 

    హాకీ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 బంగారు పతకాలు సాధించింది. దీంతో పాటు భారత్ ఖాతాలో 1 రజతం, 3 కాంస్య పతకాలు కూడా చేరాయి.

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తన చివరి పతకాన్ని గెలుచుకుంది.

    టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా హాకీలో 41 ఏళ్ల ఒలింపిక్ పతక కరువును భారత్ ముగించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 5-4తో జర్మనీని ఓడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పారిస్ ఒలింపిక్స్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పారిస్ ఒలింపిక్స్

    Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం పివి.సింధు
    Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి! బిహార్
    NASA : అంతరిక్షంలో మినీ ఒలింపిక్స్  నాసా
    Olympics : ఒలింపిక్స్‌లో పీవీ. సింధు విజయం పివి.సింధు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025