NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs BAN: భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట
    తదుపరి వార్తా కథనం
    IND vs BAN: భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట
    భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట

    IND vs BAN: భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్ - బంగ్లాదేశ్ (IND vs BAN) రెండో టెస్టు మ్యాచ్‌కు మొదటి రోజున వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు.

    మైదానం చిత్తడిగా ఉండటంతో, మ్యాచ్ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు ఆట జరిగాక, మళ్లీ వర్షం పడింది.

    వర్షం తగ్గకపోవడంతో, తొలి రోజు ఆటను ముగించినట్లు ప్రకటించారు. మొదటి రోజులో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది, ప్రస్తుతం బంగ్లా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు.

    కాన్పూర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం మునిగింది. దీంతో, షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్‌ను 10 గంటలకు నిర్వహించారు.

    వివరాలు 

     ఆలస్యంగా రెండో సెషన్ 

    ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా జట్టుకు యువ బౌలర్ ఆకాశ్ దీప్ బోల్తా కొట్టించాడు.

    ఓపెనర్లు షద్మాన్ ఇస్లామ్ (24) జకీర్ హసన్ (0)ను ఔట్ చేశాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ శాంటో, మొమినల్ హక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.

    లంచ్ విరామానికి బంగ్లా స్కోరు 74/2గా ఉంది.

    లంచ్ బ్రేక్‌కు వెళ్లే సమయంలో మళ్లీ వర్షం పడడంతో, పిచ్,మైదానాన్ని గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పారు.

    వర్షం ఆగిపోయిన తర్వాత 15 నిమిషాలు ఆలస్యంగా రెండో సెషన్ ప్రారంభమైంది.

    29వ ఓవర్‌లో, అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ శాంటో ఎల్బీగా దొరికిపోయాడు. గంట తర్వాత మళ్లీ వర్షం రావడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది.

    వివరాలు 

    అశ్విన్ కొత్త రికార్డు: కుంబ్లేని దాటిన అశ్విన్ 

    మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో, తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

    ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (6*) మొమినల్ హక్ (40*) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

    ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

    ఇప్పటివరకు మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే (419 వికెట్లు)పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు.

    తాజా బంగ్లా కెప్టెన్ శాంటో వికెట్‌తో కలిపి,ఆసియా పిచ్‌లపై అశ్విన్ 420 వికెట్లు పడగొట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    క్రికెట్

    IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన ఐపీఎల్
    IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Raman Subba Row: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి..  ఇంగ్లండ్
    IPL-Cricket-MS Dhoni: ఈలలు..కేకలు..అభిమానుల కేరింతలే.. స్టేడియమంతా ధోని నామస్మరణమే ఎంఎస్ ధోని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025