Ind Vs Eng: టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్: ఇంగ్లాండ్పై భారత్ రికార్డు ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం టీమిండియా (Team India),ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్-2 పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్కు అడుగుపెడుతుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నమెంట్కు గుడ్బై చెప్పాల్సి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్ చేరాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా,ఈ రోజు (బుధవారం)కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు,సెమీఫైనల్-2లో విజేతగా నిలిచే జట్టుతో ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో భారత్,ఇంగ్లాండ్ మధ్య గతంలో జరిగిన ముఖాముఖి పోరుల గణాంకాలు ఇలా ఉన్నాయి.
వివరాలు
టీ20 మ్యాచ్లలో భారత్-ఇంగ్లాండ్ రికార్డులు
పొట్టి ఫార్మాట్గా పేరుగాంచిన టీ20ల్లో భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు మొత్తం 29 సార్లు పరస్పరం తలపడ్డాయి. ఇందులో భారత్ 17 మ్యాచ్లలో విజయం సాధించగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్లలో గెలిచింది. స్వదేశంలో భారత్ 10 టీ20 మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఇంగ్లాండ్ తమ దేశంలో జరిగిన పోరుల్లో 5 మ్యాచ్లలో విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 4 మ్యాచ్లలో గెలుపొందగా, భారత్లో ఇంగ్లాండ్ 6 మ్యాచ్లలో విజయాన్ని అందుకుంది. తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్లలో భారత్ 3 సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ మాత్రం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది.
వివరాలు
టీ20 వరల్డ్కప్లో గణాంకాలు
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు ఐదుసార్లు ఎదురుపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా 3 మ్యాచ్లలో గెలవగా, ఇంగ్లాండ్ 2 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై భారత్ చేసిన అత్యధిక స్కోర్ 218 పరుగులు కాగా, కనిష్ట స్కోర్ 150 పరుగులు. మరోవైపు భారత్పై ఇంగ్లాండ్ చేసిన అత్యధిక స్కోర్ 200 పరుగులు కాగా, అత్యల్ప స్కోర్ 80 పరుగులు. గురువారం జరగబోయే సెమీఫైనల్లో విజయం సాధించి ఇంగ్లాండ్పై తమ ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే టీ20 వరల్డ్కప్ ఫైనల్కు చేరాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ కీలక పోరును వీక్షించేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.