Page Loader
PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!
రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ!

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
07:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట ఒక బలమైన చర్య చేపట్టింది. బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన తీవ్ర దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. ఈ దాడులు గురువారం కూడా కొనసాగినట్టు తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో, గురువారం పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఓ డ్రోన్ కుప్పకూలింది. అది సమీపంలోని ఓ రెస్టారెంట్ భవనంపై పడడంతో అక్కడ ఉన్న పలువురు గాయపడ్డారు. ఈ ఘటన పీఎస్ఎల్ 2025 మ్యాచ్‌ ప్రారంభానికి కొద్దిసేపటికి జరగడం పీసీబీకి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) తీవ్ర ఆందోళన కలిగించింది.

వివరాలు 

షావర్ జల్మీ-కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ రద్దు 

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌) 2025లో భాగంగా జరిగే మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే రావల్పిండి స్టేడియం సమీపంలో ఈ డ్రోన్ కూలిన ఘటన సంభవించింది. పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌కు ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారత్‌ దాడులతో ఇప్పటికే కలవరపడుతున్న పీసీబీ, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తక్షణమే పీఎస్‌ఎల్‌ 2025 మ్యాచ్‌లను కరాచీకి మళ్లించింది. రాత్రి 8 గంటలకు రావల్పిండిలో జరగాల్సిన పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌ రద్దైంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని భద్రతా పరిస్థితులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

వివరాలు 

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం 

ఇక పీఎస్‌ఎల్‌ 2025లో పాల్గొంటున్న ఇంగ్లండ్ క్రికెటర్ల భవితవ్యంపై కూడా అనిశ్చితి నెలకొంది. ఈ లీగ్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు మిగతా మ్యాచ్‌ల్లో కొనసాగాలా లేక వెంటనే పాక్ విడిచిపెట్టాలా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అత్యవసర భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. భారత్ దాడుల ప్రభావంతో ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లలో భయం నెలకొందని సమాచారం. వారు పీఎస్‌ఎల్‌ 2025 నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్