అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేసిన ఐఓసీ.. కారణాలివే!
అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేస్తూ ఐఓసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐబీఎ, అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో బ్యాక్సింగ్ సంఘం తమ సూచనలను పట్టించుకోకపోవడంతో ఐఓసీ చర్యలను తీసుకుంది. అయితే 2024 పారిస్ క్రీడల్లో ఒలింపిక్ క్రీడగా బాక్సింగ్ హోదా కొనసాగుతుంది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును రద్దు చేయాలని రెండు వారాల క్రితమే ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డును కోరింది. గురువారం జరిగిన ఓటింగ్లో రద్దుకు అనుకూలంగా 69 దేశాలు ఓటు వేశాయి. ఒక్క దేశం మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. పది సభ్యదేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు.
ఐఓసీ, ఐబీఏకు మధ్య వివాదాలు
ఐఓసీకి ఐబీఏకు మధ్య నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతోంది. బ్యాకింగ్స్ కు తాము ఎంతో విలువ ఇస్తామని, ఐబీఏ పాలనలో చాలా సమస్యలున్నాయని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ వెల్లడించారు. ఉబ్బెకిస్థాన్, రష్యాలకు చెందిన అధ్యక్షుల హయాంలో ఏబీఏ పరిపాలన తీరుపై ఐఓసీకి ప్రధానంగా చాలా అభ్యంతరాలున్నాయి. ముఖ్యంగా ఐబీఏ ఆర్థిక వ్యవహారాలతో పాటు జడ్జింగ్ లో నిజాయతీపై కూడా ఐఓసీకి చాలా అనుమానాలున్నట్లు సమాచారం. ఐఓసీ ఇప్పటికే ఐబీఏ ప్రమేయం లేకుండానే పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ పోటీలను పర్యవేక్షించింది. గతంలోనూ టోక్యో ఒలింపిక్స్లో అలాగే చేసింది.