NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
    IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
    1/2
    క్రీడలు 0 నిమి చదవండి

    IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2023
    06:16 pm
    IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
    చెన్నై, గుజరాత్ మ్యాచ్ లో డాట్ బాల్స్ స్థానంలో ట్రీ ఎమోజీలు

    ఐపీఎల్ లో ఓ కొత్త కార్యక్రమానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఫ్లే ఆఫ్స్ స్టేజ్ లో జరిగే మ్యాచులలో పడే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచులో 84 డాట్ బాల్స్ పడ్డాయి. దీంతో బీసీసీఐ మొత్తం మీద 42 వేల మొక్కలను నాటనుంది. ఇక నాలుగు మ్యాచులో 200 డాట్స్ బాల్స్ పడితే మొత్తంగా లక్ష మొక్కలను దేశ వ్యాప్తంగా నాటనుంది. అదే విధంగా ఐపీఎల్ 2023 సీజన్ మొదటి ఎలిమినేటర్ లో తొలి డాట్ బాల్ పడగానే మొక్క బొమ్మను స్కోర్ బోర్డు చూపించడం గమనార్హం.

    2/2

    టాటా కంపెనీస్ తో చేతులు కలిపిన బీసీసీఐ

    డాట్ బాల్స్ పెరిగే కొద్ది నాటే మొక్కల లెక్కను స్కోరు బోర్డు చూపించనున్నారు. గత సీజన్లో ఫైనల్ కు చేరిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 202 సీజన్ తర్వాత దేశ వ్యాప్తంగా 5 లక్షల మొక్కలను నాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం వెనుక రాజస్థాన్ రాయల్స్ ఆలోచనే కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్లేఆఫ్స్ లో ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు నాటడానికి టాటా కంపెనీస్ తో చేతులు కలపడం చాలా గర్వంగా ఉందని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బీసీసీఐ
    క్రికెట్

    బీసీసీఐ

    టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా క్రికెట్
    క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం క్రికెట్
    తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..! క్రికెట్
    17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు క్రికెట్

    క్రికెట్

    డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి టీమిండియా
    ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్  మ్యాచ్‌కు దూరం..? ఎంఎస్ ధోని
    వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ ఐసీసీ
    పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023