NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్
    విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్

    IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.

    దీంతో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు ప్రారంభించింది.

    ఈ మేరకు బీసీసీఐ నేడు (మే 11న) ఫ్రాంఛైజీల యజమానులు, వాటాదారులతో సమావేశం నిర్వహించనుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌కు వారం రోజుల విరామం లభించింది.

    ఈ సమయంలో పలువురు విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది స్వదేశాలకు వెళ్లిపోయారు.

    టోర్నీ పునఃప్రారంభమవుతుందని తెలిసిన వెంటనే వారు తిరిగి భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.

    Details

    విదేశీ ఆటగాళ్ళు టోర్నీ ఆడతారు

    'విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఇండియాకి వచ్చి టోర్నీలో పాల్గొనతారన్న నమ్మకం ఉంది.

    వారం రోజుల విరామం కారణంగా వారు తమ కుటుంబాలతో గడపాలని కోరుకున్నారు. మేం సమీక్ష నిర్వహించి తదనుగుణంగా ఫ్రాంఛైజీలకు సమాచారం అందిస్తామని ధుమాల్ తెలిపారు.

    ఇదిలా ఉండగా, మిగిలిన మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐని సంప్రదించినట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు.

    'అలాంటి వార్తలు వినబడ్డా.. కానీ బీసీసీఐ ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు. ఇతర దేశాలు ఈ టోర్నీ నిర్వహించేందుకు ఉత్సాహం చూపడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

    ఈ సీజన్‌లో ఇంకా 16 మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్‌ సహా మిగిలి ఉన్నాయి. వీటిని భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    ఐపీఎల్

    తాజా

    IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్ బీసీసీఐ
    Sumanth: మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్  మృణాల్ ఠాకూర్
    PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష నరేంద్ర మోదీ
    Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే! టాటా

    బీసీసీఐ

    BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం టీమిండియా
    BCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..!  క్రీడలు
    Kevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్‌ బృందంలోకి కెవిన్ పీటర్సన్ కెవిన్ పీటర్సన్
    BCCI: టీమిండియా జట్టులో ప్రక్షాళనకు బీసీసీఐ శ్రీకారం.. పది పాయింట్లతో పాలసీ క్రీడలు

    ఐపీఎల్

    RCB vs PBKS : తేలిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. ఒకే ఒక్క భారతీయుడిగా అరుదైన ఘనత రోహిత్ శర్మ
    IPL 2025: ఐపీఎల్‌ 2025 గేమ్‌ చేంజర్లు వీరే.. ఎవరు ఏ లిస్టులో ముందున్నారంటే?  క్రికెట్
    CSK: చైన్నైకి ఫ్లే ఆఫ్స్ ఛాన్సుందా?.. ఇలా జరిగితే సాధ్యమే! చైన్నై సూపర్ కింగ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025